Breaking News

Latest News

రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా నామినేషన్ లు దాఖలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, బాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు. సోమవారం అమరావతి అసెంబ్లీ భవనంలో సానా సతీష్,బాష్యం రామకృష్ణ,చింతకాయల విజయ్ లు తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్. వనితా రాణికి అందచేశారు. ఈ నామినేషన్ల దాఖలు ప్రక్రియలో కూటమి పార్టీ నేతలు పాల్గొని ప్రతిపాదకులుగా సంతకాలు చేశారు. రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా సానా సతీష్ రెండు సెట్ …

Read More »

గోదావరి పుష్కరాలకు వసతి ప్రణాళిక సిద్ధం చేయాలి: కలెక్టర్ కీర్తి చేకూరి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గోదావరి పుష్కరాలు–2027 సందర్భంగా జిల్లాకు భారీ సంఖ్యలో వచ్చే భక్తులు, అధికారులు, సేవా సిబ్బందికి అవసరమైన వసతి సౌకర్యాల కల్పన కోసం సమగ్ర ప్రణాళికను ముందస్తుగా సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. బొమ్మూరులోని కలెక్టరేట్‌లో సోమవారం తహసీల్దార్లు, వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు భవనాలు, పాఠశాలలు, కళాశాలలు, కళ్యాణ మండపాలు, సత్రాలు, కమ్యూనిటీ హాళ్లు, ఖాళీ స్థలాలు తదితర వసతి కేంద్రాలను …

Read More »

ప్రజా సేవే పరమావధి: మంత్రి కందుల దుర్గేష్

-నిడదవోలులో ఉచిత మజ్జిగ పంపిణీ చేసిన మంత్రి కందుల దుర్గేష్ -మానవత సేవా సంస్థ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ.. పాల్గొన్న మంత్రి దుర్గేష్ -ఎండల్లో దాహార్తిని తీర్చడం అభినందనీయం: మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : నిడదవోలు నియోజకవర్గం నిడదవోలు పట్టణంలోని గణేష్ చౌక్ వద్ద మానవత నిడదవోలు శాఖ ఆధ్వర్యంలో వేసవికాలాన్ని పురస్కరించుకుని ప్రతిరోజూ నిర్వహిస్తున్న ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి …

Read More »

భారతీయ సంస్కృతిలో అద్భుత వరం యోగా: మంత్రి కందుల దుర్గేష్

-సీఎం ఆశయాలకు అనుగుణంగా ‘హెల్దీ, వెల్దీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్’ సాధనే లక్ష్యంగా ముందుకు సాగాలి: మంత్రి కందుల దుర్గేష్ -రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఘనంగా నిర్వహించిన ‘యోగాంధ్ర–2026’ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్, కలెక్టర్ కీర్తి చేకూరి, ఉన్నతాధికారులు -వెల్‌నెస్ సెంటర్ల ఏర్పాటుతో ఏపీ పర్యాటక రంగానికి కొత్త ఊపు: మంత్రి దుర్గేష్ ఐశ్వర్యానికి, ఆనందానికి -ఆరోగ్యమే తొలిమెట్టు: మంత్రి కందుల దుర్గేష్ -మానసిక ఒత్తిడిని అధిగమించడానికి యోగా ఉత్తమ సాధనం: కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : …

Read More »

క్యాపిటల్‌ ఆస్పత్రిలో గైనకాలజీ వర్క్‌షాప్‌..

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని క్యాపిటల్‌ ఆస్పత్రిలో ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ కౌన్సిల్‌, ఐఎంఏ విజయవాడ చాప్టర్‌ సంయుక్త ఆధ్వర్యంలో ‘లైవ్‌ అడ్వాన్స్‌డ్‌ మినిమల్లీ ఇన్వేసివ్‌ గైనకాలజీ వర్క్‌షాప్‌’ నిర్వహించారు. ఆదివారం అన్నయ వారి కళ్యాణమండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రముఖ వైద్య నిపుణులు సుమారు 20 సంక్లిష్ట శస్త్రచికిత్సలను ప్రత్యక్షంగా చేసి చూపించారు. ఈ వర్క్‌షాప్‌కు 200 మందికి పైగా వైద్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆస్పత్రి మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ హరీష్‌ మన్నే …

Read More »

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనకు విస్తృత ఏర్పాట్లు పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 9వ తేదీన తిరుపతి జిల్లా పర్యటన సందర్భంగా ఏర్పాట్లను పగడ్బందీగా చేపట్టాలనీ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. సోమవారం ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా స్థానిక దామినేడు వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ముఖ్యమంత్రి హాజరుకానున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ జిల్లా ఎస్ పి ఎల్ .సుబ్బారాయుడు, జాయింట్ కలెక్టర్ గోవిందరావు, చంద్రగిరి, తిరుపతి ఎమ్మెల్యేలు పులివర్తి నాని, ఆరని …

Read More »

జూన్ 09 న రాష్ట్ర ముఖ్యమంత్రి తిరుపతి రాక!

-జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లాలో ఒక రోజు పర్యటించనున్న నేపథ్యంలో జూన్ 09 న తిరుపతికి విచ్చేయనున్నారని జిల్లా కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా మంగళవారం ఉ.10.40 గం.లకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారన్నారు. అనంతరం తిరుపతి రూరల్ మండల పరిధిలో గల దామినేడు గ్రామం వద్ద ఉన్న మహీంద్రా షో రూమ్ సమీపంలో ఏర్పాటు చేసిన ఎన్ డి ఏ బహిరంగ …

Read More »

వాణిజ్య, పెట్టుబడి సంబంధాలను బలోపేతం చేసేందుకు మలేషియా కాన్సుల్ జనరల్‌కు ఏపీ ఛాంబర్స్ స్వాగతం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్, మలేషియా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు, వ్యాపార సహకారాన్ని మరింత బలోపేతం చేసే అవకాశాలను అన్వేషించేందుకు ఏపీ ఛాంబర్స్ ఈ రోజు విజయవాడలోని తన కార్యాలయంలో ఉన్నతస్థాయి మలేషియా ప్రతినిధి బృందానికి ఆతిథ్యమిచ్చింది. ఈ సమావేశాన్ని ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి మండలి (ఏపీ ఈడీబీ) సమన్వయం చేసింది. మలేషియా ప్రతినిధి బృందంలో దక్షిణ భారత మలేషియా కౌన్సుల్ జనరల్ శరవణ కుమార్ కుమారవసగం, చెన్నైలోని మలేషియా కాన్సులేట్ జనరల్ వాణిజ్య కౌన్సుల్ వాన్ అహ్మద్ తార్మిజీ వాన్ …

Read More »

లింగ నిర్ధారణపై ఫిర్యాదుల‌ టోల్‌ఫ్రీ నంబ‌రు 1800 233 2447

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఆడ శిశువుల సంరక్షణ, మహిళా భ్రూణ హత్యల నివారణ కోసం అమలులో ఉన్న ప్రీ-క‌న్సెప్ష‌న్ అండ్ ప్రీ-నాట‌ల్ డ‌యాగ్నొస్టిక్ టెక్నిక్స్‌ ( PC&PNDT) చట్టాన్ని మరింత కట్టుదిట్టంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ ( 1800 233 2447 ) ను ప్రారంభించింది. గర్భంలో ఉన్న శిశువు ఆడా.. మగా.. అని చెప్పడం, తెలుసుకోవడం, అడగడం, ప్రోత్సహించడం వంటి చ‌ర్య‌లు చట్టరీత్యా నేరమని ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ క‌మీష‌న‌ర్ జి.వీర‌పాండియ‌న్ …

Read More »

హెచ్. పి. వి. టీకా పంపిణీ గడువు మరో 3 నెలల పొడిగింపు

-3.45 లక్షల్లో ఇప్పటివరకు 78.57% మంది బాలికలకు వ్యాక్సినేషన్ -విద్యా సంస్థల పునః ప్రారంభం దృష్ట్యా మిగిలిన వారికి వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి -ఉన్నతాధికారులకు మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాలు -ఆందోళనక్కర్లేదు.. సంకోచం లేకుండా ముందుకు రావాలని తల్లిదండ్రులకు మంత్రి విజ్ఞప్తి అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : గర్భాశయ ముఖ ద్వారం (సర్వైకల్ క్యాన్సర్ కేసుల నిరోధానికి చేపట్టిన హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్. పి. వి.) వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మూడు నెలల పాటు (ఆగస్టు వ‌ర‌కు) పొడిగించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య …

Read More »