విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రక్తం లభించక రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాణం పోకూడదని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. మొగల్రాజుపురంలోని జమ్మిచెట్టు సెంటర్ వద్ద నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ రక్తదానం చేసేందుకు ప్రజల్ని చైతన్యపరచడమే కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు. ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి 65 సంవత్సరాల వరకూ రక్తాన్ని దానం చేయవచ్చని మల్లాది విష్ణు పేర్కొన్నారు. 3 నెలలకు ఒకసారి …
Read More »Latest News
రవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత శస్త్రచికిత్సలు…
-క్లిష్టమైన హెర్నియా ఆపరేషన్ ద్వారా 38 సెం.మీ గడ్డ తొలగింపు -రవి హాస్పిటల్ ఉచిత ఆపరేషన్ డ్రైవ్ లో విజయవంతంగా 30 శస్త్రచికిత్సలు -100 ఆపరేషన్లు ఉచితంగా నిర్వహిస్తామని డాక్టర్ రవికాంత్ కొంగర వెల్లడి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అత్యాధునిక వైద్య సేవలు అందరికీ అందించాలనే లక్ష్యంతో రవి ఫౌండేషన్ నిర్వహిస్తున్న ఉచిత ఆపరేషన్ డ్రైవ్ విజయవంతంగా కొనసాగుతోంది. సూర్యారావుపేట స్వాతి ప్రెస్ సమీపంలోని రవి హాస్పిటల్లో ఇంతవరకు 30 మందికి ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహించడం విశేషం. రవి ఫౌండేషన్ ద్వారా …
Read More »పేద వారి కోసం పెద్ద మనసుతో ఏర్పాటు చేసిన కళ్యాణ వేదిక…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పెళ్లిళ్ల సీజన్లో కళ్యాణ మండపాలు దొరకడమే కష్టం. దొరికినా సామాన్యుడికి అందుబాటులో లేని అడ్వాన్సులు. కానీ లలిత రైస్ ఇండస్ట్రీస్ అధినేతల్లో ఒకరైన మట్టె శ్రీనివాస్ సుమారు రూ.4 కోట్ల వ్యయంతో సెంట్రల్ ఎయిర్ కండీషన్డ్ కళ్యాణ మండపాన్ని అన్నవరం దేవస్థానంలో ఏర్పాటు చేశారు. ఈ కళ్యాణ మండపంలో ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే తమ పిల్లల పెళ్లిళ్లు చేసుకోవచ్చు. ఇది పేద వారి కోసం పెద్ద మనసుతో ఏర్పాటు చేసిన కళ్యాణ వేదిక. అన్నవరం దేవస్థానంలో …
Read More »రైతులకు అవగాహన కల్పించే లక్ష్యంతో వైఎస్సార్ రైతు భరోసాయాత్రలు : మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రైతు భరోసా కేంద్రాల విధివిధానాలు, సీఎం యాప్ పనితీరు, ఈ–క్రాపింగ్ తదితర వ్యవసాయ సంబంధిత అంశాలపై రైతులకు అవగాహన కల్పించే లక్ష్యంతో వైఎస్సార్ రైతు భరోసాయాత్రల ప్రధాన ఉద్దేశ్యమని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) వివరించారు. శుక్రవారం ఆయన విజయవాడ రోడ్డులోని మూడు స్థంబాల కూడలిలో రైతు భరోసా వాహనానికి పచ్చ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం జిల్లాకు …
Read More »క్లీన్ ఆంధ్రప్రదేశ్ ‘క్లాప్’ కార్యక్రమంపైనా సీఎం సమీక్ష…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పురపాలక, పట్టణాభివృద్ధిశాఖపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం సమీక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా 124 మున్సిపాల్టీలు, నగరపాలక సంస్థల్లో 1.2 కోట్ల బిన్లు, 40 లక్షల ఇళ్ళకు ఇంటికి మూడు చొప్పున బిన్లు, గ్రీన్, బ్లూ, రెడ్ కలర్స్లో బిన్లు, వ్యర్ధాల(చెత్త) సేకరణకు 4868 వాహనాలు, ఇందులో 1771 ఎలక్ట్రిక్ వాహనాలు, మొదటి ఫేజ్లో 3097 వాహనాలు, 225 గార్బేజ్ ట్రాన్స్పోర్ట్ స్టేషన్లు, సేకరించిన వ్యర్ధాలను వివిధ విధానాల్లో ట్రీట్చేసేలా ఏర్పాట్లు, సేకరించిన వ్యర్ధాల్లో 55 …
Read More »
Prajavartha Online Telugu News