Breaking News

Daily Archives: September 4, 2024

వరద బాధితులకు గొలగాని చారిటబుల్ ట్రస్ట్ సహాయం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వరద ముంపు ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు గొలగాని చారిటబుల్ ట్రస్ట్ (GCT) అండగా నిలుస్తోంది. బాధితులకు ప్రవాస భారతీయులు గొలగాని రవికృష్ణ ఆధ్వర్యంలోని గొలగాని చారిటబుల్ ట్రస్ట్ వారి అన్నదాన వారాధి ద్వారా విజయవాడలోని వరద ముంపు ప్రాంతాలు అయినా పాత రాజ రాజేశ్వరి పేట, కొత్త రాజ రాజేశ్వరి పేట, కుమ్మరిపాలెం, కబేలా సెంటర్ తదితర ప్రాంతాలలో సాయంత్రం 1,000 ప్యాకెట్ల వెజిటేబుల్ బిర్యాని, బంగాళదుంప కర్రీ భోజనం & మంచినీళ్లు పంపిణీ జరిగింది. ఇందులో …

Read More »

తిరుపతి నగరానికి తలమానికంగా రైల్వే స్టేషన్

-తిరుపతి రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను పరిశీలించిన ఎంపీ గురుమూర్తి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి ఎంపీ డాక్టర్. మద్దిల గురుమూర్తి నేడు రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను పరిశీలించారు. రైల్వే స్టేషన్ డైరెక్టర్, ఇంజనీరింగ్ అధికారులు స్టేషన్ నిర్మాణ పనుల గూర్చి ఎంపీకి వివరించారు. అనంతరం నిర్వహించిన సమీక్షా సమావేశంలో స్టేషన్ నిర్మాణాల పురోగతి, రైల్వే అండర్ బ్రిడ్జిలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిల గురించి రైల్వే ఇంజనీరింగ్ విభాగం వారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. తిరుపతి రైల్వే …

Read More »

విజయవాడ వరద ముంపు బాధితులకు బాసటగా అనకాపల్లి ఎంపీ సి.యం. రమేష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బాధితుల సహాయార్థం కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించిన అనకాపల్లి ఎంపీ సి.యం. రమేష్ కుటుంబం. వరదలతో ప్రజలకు అంతులేని కష్టం.. అపార నష్టం వాటిల్లింది. ప్రభుత్వం సర్వశక్తులు సమీకరించుకుని సహాయక చర్యలు చేపడుతోంది. వరద బాధితులను ఆదుకునేందుకు, వారికి అండగా నిలుస్తున్న ప్రభుత్వానికి చేయూతగా కోటి రూపాయల విరాళాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి తమ కంపెనీ “రిత్విక్ ప్రాజెక్ట్స్” నుంచి అందించనున్నట్లు సి.యం.రమేష్ సోదరుడు రాజేష్, కుమారుడు రిత్విక్ తెలిపారు.

Read More »

వరద ప్రాంతాలలో ముమ్మరంగా సహాయక చర్యలు

-పునరావాస కేంద్రాలలో ఉన్న ప్రజలకు భరోసా -గ్రామాలలో విద్యుత్తు పునరుద్ధరణ.. వైద్య శిబిరాలు ఏర్పాటు. -రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్‌, గొట్టిపాటి రవికుమార్‌ వెల్లడి బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త : వరద ప్రభావిత ప్రాంతాలలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ తెలిపారు. మండలంలోని కృష్ణా నది పరివాహక ప్రాంత గ్రామాలైన పెనుమూడి నుండి లంకెవాని దెబ్బ వరకు బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా లంకెవాని దెబ్బ గ్రామంలో …

Read More »

నిర్విరామంగా కొనసాగుతున్న సహాయక చర్యలు.

-స్వయంగా పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే వసంత -ఆహారంతో పాటు వాటర్ ట్యాంకర్లతో నీటి సరఫరా -56 వేల ఆహారపు ప్యాకెట్లు, 20 వేల యాపిల్స్, 15 వేల అల్పాహార ప్యాకెట్లు, 65 వేల వాటర్ బాటిల్స్, 12 వేల లీటర్ల పాలప్యాకెట్లు అందజేత. 20 ట్యాంకర్లతో తాగునీటి సరఫరా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మైలవరం నియోజకవర్గంలో వరద బాధితులకు సహాయక చర్యలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. నిరాశ్రయులైన వారికి ఆహారం, తాగునీరు, పండ్లు, పాలు పంపిణీ పనులను స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ …

Read More »

మహిళా విభాగం ఆధ్వర్యంలో వరద బాధితులకు ఆహారం పంపిణీ

-ఒక్కరోజులో 20 వేల మందికి ఆహారం అందజేత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవల కురిసిన వర్షాలకు గాను నీట మునిగిన వరద బాధితులకు మహిళా విభాగం ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం మండలంలో పలు గ్రామాలలో వాటర్ బాటిల్ మరియు భోజనాన్ని పంపిణీ చేశారు. టాటా ఏసీ ద్వారా ట్రక్కు టెర్మినల్ వరద బాధితులకు ఏర్పాటుచేసిన శిబిరాల వద్దకు వెళ్లి ఆహారాన్ని అందించారు. అనంతరం కొండపల్లి శాంతినగర్ కొత్త ఉన్న సూర్య పబ్లిక్ స్కూల్ శిబిరంలో ఆహారాన్ని అందించారు. ఇబ్రహీంపట్నంలోని రోడ్డుపై ఉంటున్న వరద …

Read More »

వరద బాధితులకు యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సహాయం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వరద ముంపు ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా జోనల్‌ ఆఫీస్‌ విజయవాడ అండగా నిలుస్తోంది. ఇటీవల కురిసిన వర్షాలకు గాను నీట మునిగిన వరద బాధితులకు యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా జోనల్‌ ఆఫీస్‌ విజయవాడ ఆధ్వర్యంలో బ్రెడ్, వాటర్ బాటిల్ మరియు భోజనాన్ని పంపిణీ చేశారు. టాటా ఏసీ ద్వారా వరద బాధితులకు ఏర్పాటుచేసిన శిబిరాల వద్దకు వెళ్లి ఆహారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సిబ్బంది …

Read More »

అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మా నాయకుడు ఎప్పుడూ క్షేత్రస్థాయిలోనే ఉన్నారు

అమరావతి నేటి పత్రిక ప్రజావార్త : వరద బాధితులకోసం 74 ఏళ్ల వయస్సులో జేసీబీ ఎక్కి ప్రజలకోసం చంద్రబాబు నాయుడు తపిస్తూ పనిచేస్తుంటే.. ప్రజల కన్నీళ్లు తడుస్తూ బురద నీటిలో కష్టపడుతుంటే.. ప్రజలు కష్టాల్లో ఉన్నా పట్టించుకోకుండా… జగన్ రెడ్డి లండన్ ఎందుకు వెళ్తున్నాడు? దోచుకున్నది దాచుకోవడానికా? లండన్ లో ఆస్తులు పెంచుకోవడానికా? నీరో చక్రవర్తికి వారసుడిలా ముసలికన్నీరు కార్చి.. ఐదు నిమిషాలు షో చేసి వెంటనే లండన్ ఎందుకు వెళ్తున్నట్లు..? ఇదివరకే లండన్ లో జగన్ కు ఆస్తులు ఉన్నట్లు సీబీఐ గుర్తించింది.. …

Read More »

విజయవాడ లో ముంపు బారిన పడిన లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలకు ధైర్యం చెబుతూ స్వయంగా భోజనం, త్రాగునీటిని అందిస్తున్న.. మంత్రి కందుల దుర్గేష్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరంలోని కొన్ని లోతట్టు  ప్రాంతాలు నీట మునగటం వలన ప్రజలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని ఇది చాలా బాధాకరమైన విషయమని, ముంపు బాధితులను ప్రభుత్వాన్ని విధాలు ఆదుకుంటుందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రాఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. బుధవారం మంత్రి కందుల దుర్గేష్ విజయవాడ నగరంలోని వరద ముంపుకు గురైన విద్యాధరపురం, కబేల సెంటర్ లోని లోతట్టు ప్రాంతాలను సందర్శించి ప్రజల ఇబ్బందులు తెలుసుకుని ఆ ప్రాంత వరద బాధితులకు ఆహార …

Read More »

దుకాణములు, వ్యాపార సంస్థలన్నీ కార్మిక శాఖ లైసెన్సులు పొందాలి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లాలోని దుకాణములు, వాణిజ్య, వ్యాపార, సంస్థలు, మోటార్ రావాణా వాహన యాజమాన్యాలు, భవన మరియు ఇతర నిర్మాణ సంస్థలు, కాంట్రాక్టు లేబర్ ని వినియోగించే కాంట్రాక్టర్లు, PRINCIPAL ఎంప్లాయర్లు అంతర్రాష్ట్ర వలస కార్మికులను వినియోగించే సంస్థలు యజమానులు విధిగా కార్మిక చట్టాల కింద వెంటనే ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ చట్టం 2015 కింద రిజిస్ట్రేషన్ చేసుకుని రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పొంది ఉండాలని తూర్పుగోదావరి జిల్లా డిస్ట్రిక్ ఇన్చార్జి ఆఫీసర్ మరియు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్, రాజమహేంద్రవరం …

Read More »