Breaking News

Monthly Archives: February 2026

రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు మంచిది కాదు

-రాజకీయాలను వైసీపీ భ్రష్టుపట్టించింది -తప్పులను కప్పిపుచ్చుకునేందుకు దూషణలు, దాడులు -ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు మంచిది కాదని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ స్పష్టం చేశారు. వైసీపీ రాజకీయాలను భ్రష్టుపట్టించిందని విమర్శించారు. ప్రపంచ ప్రఖ్యాత తిరుమల లడ్డును కూడా కల్తీ చేసిన కల్తీ పార్టీ వైసీపీ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ నేతలు, కార్యకర్తలు దాడులకు దిగుతున్నారని అన్నారు. ఆదివారం నాడు …

Read More »

కేంద్ర బడ్జెట్ 2026-27కు FIEO దక్షిణ ప్రాంతం స్వాగతం

-ఉపాధి, MSMEs, తయారీ రంగం మరియు టెక్స్టైల్స్, అగ్రి & ప్రాసెస్డ్ ఫుడ్, లెదర్ వంటి కీలక ఎగుమతి రంగాలకు ఊతం చెన్నై, నేటి పత్రిక ప్రజావార్త : ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎగుమతి సంస్థలు (FIEO) దక్షిణ ప్రాంత రీజినల్ చైర్మన్ గోపాలకృష్ణన్ ఈ రోజు కేంద్ర బడ్జెట్ 2026-27ను ఉపాధి సృష్టి, MSMEs బలోపేతం, అలాగే టెక్స్టైల్స్, అగ్రి & ప్రాసెస్డ్ ఫుడ్, లెదర్ వంటి కార్మికాధారిత ఎగుమతి రంగాల వృద్ధికి ప్రాధాన్యతనిచ్చే దూరదృష్టి గల కార్యాచరణ పథకంగా ప్రశంసించారు. అమెరికా …

Read More »

ఆర్థిక వ్యవస్థను మరింత దిగజారేలా ఈ బడ్జెట్ ఉంది… : సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర బ‌డ్జెట్ ప్ర‌స్తుతం దేశ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన‌డానికి, దాని నుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి ఏ మాత్రం అవ‌కాశం లేని బ‌డ్జెట్ ఇది. ఆర్థిక వ్యవస్థను మరింత దిగజారేలా ఈ బడ్జెట్ ఉంది. ఈ బడ్జెట్ వల్ల రూపాయి పతనం మరింత పెరిగే ప్రమాదం ఉంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా అనిశ్చితి, సంక్షోభాలు ఉన్న‌ప్పుడు దేశాన్ని వాటి నుంచి బ‌య‌ట‌ప‌డేయ‌డానికి ఏ మాత్రం దిశానిర్దేశం ఈ బ‌డ్జెట్ ఇవ్వ‌లేదు. అందుకే ఇది దిశానిర్దేశం లేని బ‌డ్జెట్‌. పెద్ద పెద్ద ప్ర‌క‌ట‌న‌లు చేశారేగాని, …

Read More »

కేంద్ర బడ్జెట్లో ఏపీకి మొండి చేయి

-మోడీతో పొగడ్తల కోసం మరో రూ.500 కోట్లు ఖర్చు చేయండి చంద్రబాబు గారూ.. -అమరావతి, పోలవరానికి మొండిచేయి -వ్యవసాయ రంగానికి నిరాదరణ -విభజన హామీల అమలుపై మౌనం -అదానీ, అంబానీలకు మేలుచేసేలా బడ్జెట్ -సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్రబడ్జెట్లో ఈ ఏడాదీ రాష్ట్రానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం మొండి చేయి చూపిందని, కేంద్రం ఏపీకి ఏమీ వెదల్చనప్పటికీ సీఎం చంద్రబాబుకు చీమకుట్టినట్లైనా లేదని, అయినప్పటికీ మరో రూ.500 కోట్లు ఖర్చు పెట్టి చంద్రబాబు మోదీతో …

Read More »

12న సార్వత్రిక సమ్మె జయప్రదం చేయండి

-లడ్డూపై అధికార, ప్రతిపక్షాల రాద్దాంతం తగదు -చంద్రబాబుకు అంబటి క్షమాపణ చెప్పాలి -మోదీ ప్రజా వ్యతిరేక విధానాలపై దేశ వ్యాప్త పోరాటాలు -సిపిఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ -14న మెడికల్ మాఫియాపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు -సార్వత్రిక సమ్మెకు సిపిఐ మద్దతు -సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశవ్యాప్తంగా ఈ నెల 12న జాతీయ కార్మిక, రైతు సంఘాలు తలపెట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర …

Read More »

​రాష్ట్రంలో జిఎస్‌టి వసూళ్ల రికార్డు….

-జనవరి 2026లో 6.72% వృద్ధి నమోదు….చీఫ్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్, బాబు ఏ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ​ఈ ఏడాది జనవరి నెలలో పన్ను వసూళ్లలో రాష్ట్రం అద్భుతమైన వృద్ధిని కనబరిచిందని చీఫ్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్, బాబు ఏ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పన్ను రేట్ల తగ్గింపు ఉన్నప్పటికీ, నికర జిఎస్‌టి (Net GST) వసూళ్లలో 6.72% వృద్ధిని నమోదు చేస్తూ రాష్ట్రం తన ఆర్థిక స్థిరత్వాన్ని చాటుకుందన్నారు. ​ ఈ ఏడాది జనవరిలో నికర …

Read More »

ప్రకృతి వ్యవసాయానికి కేంద్ర బడ్జెట్‌లో పెద్దపీట

– ఏపీ అభివృద్ధికి బలమైన పునాది – కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అభినందనలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర బడ్జెట్‌లో ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యం ఇస్తూ ఆంధ్రప్రదేశ్‌లో దాని విస్తరణకు రూ.155.32 కోట్ల కేటాయింపులు చేయడం కేంద్ర ప్రభుత్వ దూరదృష్టికి నిదర్శనమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రైతు సంక్షేమాన్ని కేంద్రంగా చేసుకుని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ దేశ వ్యవసాయ రంగానికి స్పష్టమైన …

Read More »

మహిళ మరియు మధ్య తరగతి ఉన్నతి ఉద్దేశించిన 3 కర్తవ్యాల ఆధారిత బడ్జెట్.

-లంకా దినకర్, ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ – అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఇది వికసిత భారత్ మోడీ ౩.0 – 53.47 లక్షల కోట్లు స్వదేశీయతను అణువణువున నింపిన బడ్జెట్ ఇది – ముఖ్యమైన అన్ని రంగాలలో దేశ స్వయం సమృద్ధ సమ్మిళిత అభివృద్ధి నిర్దేశించే మోడీ మార్క్ యువ శక్తి , సబ్ కా సాత్- సబ్ కా వికాస్ మహిళ మరియు మధ్య తరగతి ఉన్నతి ఉద్దేశించిన 3 కర్తవ్యాల ఆధారిత బడ్జెట్. ఈ బడ్జెట్ …

Read More »

కోర్టుల్లో వల్నరబుల్ విట్నెస్ డిపోజిషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలి

గుంటూరు, మహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : లైంగిక నేరాల బాధితులు, పిల్లలు, బెదిరింపుల మధ్య ఉన్న సాక్షులు మళ్లీ మానసిక వేదనకు గురికాకుండా, వారి వాంగ్మూలాలను సురక్షితమైన, భద్రమైన, పిల్లల అనుకూల వాతావరణంలో నమోదు చేసేందుకు అన్ని కోర్టుల్లో వల్నరబుల్ విట్నెస్ డిపోజిషన్ సెంటర్లు (VWDCలు) ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా నియమించిన వల్నరబుల్ విట్నెస్ కమిటీ చైర్‌పర్సన్ జస్టిస్ గీతా మిట్టల్ స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు నియమించిన వల్నరబుల్ విట్నెస్ కమిటీ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వల్నరబుల్ విట్నెస్ …

Read More »

పాతగన్నవరంలో వైభవంగా శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ, గోపయ్య స్వామివార్ల కల్యాణ మహోత్సవం

-ప్రత్యేక పూజలు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు, జ్ఞానేశ్వరి దంపతులు గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా జిల్లా గన్నవరం మండలంలోని పాతగన్నవరంలో కొలువైన ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ సమేత గోపయ్య స్వామివార్ల వార్షిక కల్యాణ మహోత్సవం ఆదివారం రాత్రి కన్నుల పండువగా, అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక వేడుకకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు, జ్ఞానేశ్వరి దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే …

Read More »