విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన డా. జి.లక్ష్మీశ సోమవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువచేసి పారదర్శకమైన సేవలు అందించి, జిల్లా సమగ్రాభివృద్ధికి కృషిచేయాలని సూచిస్తూ కలెక్టర్కు శుభాకాంక్షలు తెలిపారు.
Prajavartha Online Telugu News