Breaking News

మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్న “పెన్”నేతలు

మోపిదేవి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి గాంచిన మోపిదేవి లో స్వయంభూగా కొలువుదీరిన శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ న్యూస్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (పెన్) రాష్ట్ర సంఘ నేతలు దర్శించుకున్నారు. ఆలయ పండితులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆలయ మర్యాదలతో గౌరవించారు. స్వామివారి శేషవస్త్రాన్ని కప్పి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో “పెన్” జిల్లా సంఘ ప్రధాన కార్యదర్శి సామర్ల మల్లికార్జునరావు, సీనియర్ పాత్రికేయులు సుబ్బారావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Check Also

యువతకు వినూత్న మరియు భవిష్యత్తు నైపుణ్యాలపై సీడ్ యాప్ సంస్థ లో వర్క్‌షాప్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పరిశ్రమతో రాష్ట్ర యువతను మమేకం చేసే లక్ష్యంతో వారికి శిక్షణ అందించి మెరుగైన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *