మోపిదేవి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి గాంచిన మోపిదేవి లో స్వయంభూగా కొలువుదీరిన శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ న్యూస్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (పెన్) రాష్ట్ర సంఘ నేతలు దర్శించుకున్నారు. ఆలయ పండితులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆలయ మర్యాదలతో గౌరవించారు. స్వామివారి శేషవస్త్రాన్ని కప్పి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో “పెన్” జిల్లా సంఘ ప్రధాన కార్యదర్శి సామర్ల మల్లికార్జునరావు, సీనియర్ పాత్రికేయులు సుబ్బారావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Tags mopidevi
Check Also
మస్టర్ పాయింట్లను ఆకస్మిక తనిఖీ
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : వార్డ్ సచివాలయ శానిటేషన్ కార్యదర్శులు మస్టర్ సమయంలో తప్పనిసరిగా ప్రజారోగ్య కార్మికుల హాజరు …