గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమము…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని (అనంతపురం,కర్నూలు మరియు వైయస్ఆర్ కడప జిల్లాలు మినహా) పశుపోషకులందరికీ సంచాలకులు, పశుసంవర్తకశాఖ వారి విజ్ఞప్తి, పశుసంవర్ధకశాఖ వారు 01-10-2021 నుండి 31-10-2021వ తేది వరకు పశువులకు గాలికుంటు వ్యాంధి నివారణ టీకాలు ఉచితముగా ప్రతి గ్రామములో రైతు ఇంటి వద్దనే వేయట జరుగుతుంది. గాలికుంటు వ్యాధి వలన పాల ఉత్పత్తి మరియు పునరుత్పత్తి సామర్ధ్యం గణనీయంగా తగ్గిపోవడంతో రైతులకు ఆర్థిక నష్టం కలుగుతుంది. కావున పశుపోషకులు అందరూ ఎటువంటి అపోహలకు తావివ్వకుండా తమ పశువులన్నింటికి టీకాలు వేయించుకొని గాలికుంటు వ్యాధి నుండి కాపాడుకోవలసినదిగా కోరడమైనది. మరింత సమాచారము కొరకు మీదగ్గరలోని పశువైద్యుని సంప్రదించగలరని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ ప్రచార మరియు విస్తరణ విభాగం ఉప సంచాలకులు డాక్టర్ పి. పద్మ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

స్థానిక సంస్థల ఎన్నికలు, నియోజక వర్గాల పునర్విభజన అధ్యయనానికి జనసేన కమిటీ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు, నియోజకవర్గాల పునర్విభజన (డీ లిమిటేషన్) జరిగే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *