తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త :
మర్చి 12న జరిగే జాతీయ లోకదాలత్లో బ్యాంకర్ల దావాలు పరిష్కరించాలని బ్యాంకు అధికార్ల సమావేశములో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ న్యాయ మూర్తి టి. రామచంద్రుడు, అదనపు సీనియర్ సివిల్ న్యాయ మూర్తి కె. వాణి బ్యాంకర్స్ ను కోరారు. గురువారం కోర్టు హాలులో జరిగిన సమవేశం నందు న్యాయ మూర్తులు మాట్లాడుతూ కక్షి దారులకు జాతీయ లోక్ అదాలత్ గురించి తెలియజెసి ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కరించడానికి చొరవ చూపాలని బ్యాంకర్లను కోరారు. ఈ సమావేశంలో వివిథ బ్యాంకులనుండి వారి ప్రతినిథీలు హాజరై తమవంతు సహాకారం అందించగలమని తెలిపారు.
Prajavartha Online Telugu News