Breaking News

ఎం ఆర్ పి ధరలకే నిత్యావసర వస్తువులు విక్రయించాలి…

-నగరంలో పలు దుకాణాల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆకస్మిక తనిఖీలు…
-రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి టి.కనకరాజు 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నిత్యావసర సరుకులను ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని, అధిక ధరలకు అమ్మినా, అక్రమంగా సరుకులను నిల్వచేసినా కేసులు నమోదు చేయడం జరుగుతుందని విజయవాడ యూనిట్ రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి టి.కనకరాజు హెచ్చరించారు. విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విజయవాడ యూనిట్ రీజినల్ ఆఫీసర్ టి.కనకరాజు నాయకత్వంలో లీగల్ మెట్రోలజీ, పౌరసరఫరాలశాఖ సంయుక్త ఆధ్వర్యంలో అధికారులు మోడరన్ సూపర్ మార్కెట్, ఉషోదయ, రిలయన్స్ మార్ట్, మెట్రో మార్ట్ ,ఫ్లిప్ కార్డ్ సూపర్ మార్కెట్ వంటి పలు నిత్యావసర సరుకుల దుకాణాల్లో ఆకస్మికంగా దాడులు నిర్వహించి ధరలను పరిశీలించారు. ఎంఆర్పి ధరలకే సరుకులను కొనుగోలు చేశారా, అని వినియోగదారులను అడిగి తెలుసుకున్నారు.ముఖ్యంగా వంటనూనెలను ఎంఆర్పి ధరలకే విక్రయించాలని దుకాణాలు నిర్వాహకులను ఆదేశించారు. కందిపప్పు, మినపప్పు, నూనెలను అక్రమంగా నిల్వచెసి బహిరంగ మార్కెట్లో కృతిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయాలు జరిపే దుకాణాల పై కేసులు నమోదు చేయటం జరుగుతుందని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ టి.కనకరాజు హెచ్చరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

స్వర్ణాంధ్ర , స్వచ్ఛ ధర్మవరం లక్ష్యంగా ముందుకు సాగుదాం.

-ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి సాధ్యం… -మంత్రి సత్య కుమార్ యాదవ్ ధర్మవరం, నేటి పత్రిక ప్రజావార్త : పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *