Breaking News

ఘనంగా గోకులక్షత్రంలో గీతాజయంతి ఉత్సవాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
హరే కృష్ణ గోకులక్షత్రం వారు గీతాజయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకు న్నారు.5000 క్రితం శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడు విషాదంలో ఉన్నప్పుడు చెప్పిన వాక్యాలను గీతా శాస్త్రoగా పేరు గాంచింది. ఇప్పటికి మన దైనందిని జీవితంలో ప్రతి రోజు కూడ వెలుగులు నింపే అద్భుతమైన గ్రంధం భగవద్గీత. మనకు గ్యమ్యాన్ని చూపించిటంతో పాటు మన సమస్యలను పారష్కరించే జ్ఞానాన్ని ఇస్తుంది. ఇలాంటి భగవద్గీత గ్రంధాన్ని అందరు చదవాలని హరే కృష్ణా మూవ్మెంట్ ఇండియా వారి ఆధ్వర్యంలో మన తాడేపల్లి గోకుల క్షేత్రంలో 108 శ్లోకాలతో గీతా యజ్ఞం నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని హరే కృష్ణా గోకుల క్షేత్రం అధ్యక్షులు శ్రీ వంశీధర దాస గారు భగవద్గీత లోని 18 అధ్యాయాలను వాటి ఆవశ్యకతను వివరించారు. ఉపన్యాసం అనంతరం గీతా పూజ మరియు సంకీర్తన అద్భుతంగా జరిగింది. భక్తులు పాల్గొని తీర్ద ప్రసాదాలు మరియు భగావంతుని ఆశీస్సులు పొందారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పవన్ కళ్యాణ్ చొరవ… శివయ్యకు నూతన ఆలయం…

-రూ. 55 లక్షల టీటీడీ నిధులతో వర్తనపల్లి శివాలయం పునర్నిర్మాణం -పాడేరు పర్యటనలో శివాలయాన్ని సందర్శించిన ఉప ముఖ్యమంత్రి -శిథిలావస్థకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *