హైదరాబాద్ , నేటి పత్రిక ప్రజావార్త :
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. శుక్రవారం హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ నివాసానికి ఆయన వెళ్లారు. పవన్ కళ్యాణ్ సాదర స్వాగతం పలికారు. ఈ సమావేశంలో వర్తమాన సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉపాధి అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, బ్రిటిష్ డిప్యూటీ హై కమిషన్ పొలిటికల్ ఎకానమీ సలహాదారు నళిని రఘురామన్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News