-గత వారం రోజులుగా నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో ఎమ్మెల్యే నాని బిజీబిజీ….
-గురువారం గుడ్లవల్లేరులో సచివాలయం, RBK కేంద్రం, హెల్త్ క్లినిక్ లను ప్రారంభించిన ఎమ్మెల్యే…
-ప్రజలకు చేసిన మంచిని అడిగే ఓట్లు అడుగుతాం…. చంద్రబాబులా మాయమాటలు చెప్పాల్సిన కర్మ మాకులేదు
గుడ్లవల్లేరు, నేటి పత్రిక ప్రజావార్త :
మండల కేంద్రమైన గుడ్లవల్లేరు పరిధిలో నూతనంగా నిర్మించిన సచివాలయం2, అనుబంధ RBK కేంద్రం మరియు విలేజ్ హెల్త్ క్లినిక్ లను ఎమ్మెల్యే కొడాలి నాని గురువారం ప్రారంభించారు. తొలుత గ్రామ సెంటర్లో ఎమ్మెల్యే కొడాలి నానికు వైసిపి నేతలు గజమాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామ ప్రధాన రహదారుల్లో ర్యాలీగా పర్యటించిన ఎమ్మెల్యే కొడాలి నాని, భారతరత్న అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి, ఆర్.సి.యం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే నానీకు వీధి వీధినా మంగళ హారతులు పూలమాలలతో గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. అనంతరం జడ్పీ చైర్మన్ ఉప్పాల హారిక, ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే కొడాలి నాని ప్రభుత్వ కార్యాలయాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ గుడివాడ నియోజకవర్గ ప్రజల కోసం 14 ఏళ్ల సీఎం చంద్రబాబు ఒక్క ఎకరా అయిన సేకరించారా అన్న తన చాలెంజ్ కు బదులు చెప్పలేని టిడిపి నేతలు, రోడ్లపై తిరుగుతూ తమ నాయకుడు మాదిరే కల్లబొల్లి మాటలకే పరిమితమయ్యారని ఎమ్మెల్యే నాని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ ప్రజల మంచి కోసం చేసిన కార్యక్రమాలను చూసి ప్రతి ఒక్కరు తమ రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుపై ఉన్న బటన్లు నొక్కి వైఎస్ఆర్సిపి అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే నాని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ ఉప్పాల హారిక, ఎంపీపీ సురేష్, వైస్ ఎంపీపీ సాయన రవి, వైసీపీ నాయకులు కోటప్రోలు నాగు, పాలేటి చంటి, ఉప్పాల రాము, పడమటి సుజాత,వేమవరం కొండలమ్మ దేవస్థానం చైర్మన్ శేషం గోపి, మాజీ చైర్మన్ తాళ్లూరు మాధవ్, పిఎసిఎస్ అధ్యక్షుడు దుగ్గిరాల శేషుబాబు, వ్యవసాయ సలహా కమిటీ జిల్లా డైరెక్టర్ పెన్నేరు ప్రభాకర్,గుడివాడ మార్కెట్ యార్డ్ చైర్మన్ మట్టా నాగమణి జాన్ విక్టర్, వైసిపి జిల్లా యూత్ అధ్యక్షుడు మెరుగు మాల కాళీ,ఎంపీటీసీ పెనుమాల పూర్ణిమ,రంగారావు, దుగ్గిరాల శేషుబాబు,డోకిపర్రు రామిరెడ్డి, వడ్లమన్నాడా గోపి, గుదే రవి,మండల పరిధిలోని వెలాధిమంది డ్వాక్రా సంఘాల మహిళలు, ప్రభుత్వ శాఖల అధికారులు, మండలంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరియు అభిమానులు , సచివాలయ కన్వీనర్ లు , గృహ సారధులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News