Breaking News

ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న నందమూరి రామకృష్ణ

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
నందమూరి తారకరామారావు కుమారులు నందమూరి రామకృష్ణ విజయవాడ ఇంద్రకీలాద్రిపైనున్న దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం వేద పండితుల ఆశీర్వాదాలు పొందారు. విభజన అనంతరం ఎంతో కష్టబడి పునాదుల నుండి నిర్మించుకుంటున్న రాష్ట్రాన్ని జగన్ రెడ్డి గెలిచాక సర్వ నాశనం చేశాడని అన్నారు. చంద్రబాబు పాలనలోనే రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ బాటలో పరుగులు పెడుతుందన్నారు. జూన్ 4 తర్వాత మళ్లీ దర్శించుకుంటానని తెలిపారు. నందమూరి రామకృష్ణతో తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి ప్రధాన కార్యదర్శి వీరంకి వెంకట గురుమూర్తి, వీరమాచినేని శివప్రసాద్, వల్లూరు కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : కర్ణాటక నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి విస్తరించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *