-రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అనంతపురం లో పోలీసుల వేధింపులకు గురై ఆత్మహత్య కు పాల్పడిన అబ్దుల్లా కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. ఈ ఘటనకు కారుకులైన దోషులను శిక్షించి ఆ కుటుంబానికి న్యాయం చేస్తామన్నారు. రాష్ట్ర మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు ఫారూఖ్ షిబ్లీ నేతృత్వంలో ఆత్మహత్య కు పాల్పడిన అబ్దుల్లా భార్య నదీమ, కొడుకు మొహమ్మద్ అయాన్ (7 సం||లు), కూతురు సమీన (12 సం||లు) గురువారం రాష్ట్ర సచివాలయంలో మంత్రిని కలిసి తమకు న్యాయం చేయాలని కోరిన నేపథ్యంలో పై విధంగా మంత్రి స్పందించారు. మృతుడి భార్య నసీమా తమ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని మంత్రికి వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన ఈ అంశంపై స్పందించి దోషులను శిక్షించి, తమ కుటుంబ జీవనోపాధికి ఉద్యోగాన్ని, పిల్లలు చదువుకు తోడ్పాటును అందజేయాలని విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తికి సానుకూలంగా మంత్రి స్పందిస్తూ మైనార్టీ ప్రభుత్వ సంస్థలో తాత్కాలిక ఉపాధిని కల్పిస్తామని హామీ ఇచ్చారు.