ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
తెలంగాణ రాష్ట్ర ఎలక్షన్ కమీషనరు సి.పార్థసారథి దంపతులు సోమవారం శ్రీ అమ్మవారి ఆలయమునకు విచ్చేయగా డిప్యూటీ కలెక్టర్ మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి కె ఎస్ రామరావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం తెలంగాణా ఎలక్షన్ కమీషనరు దంపతుల వారు అమ్మవారిని దర్శనం చేసుకొనగా, వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి వారు వీరికి శ్రీ అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదము మరియు చిత్రపటం అందజేశారు.
Prajavartha Online Telugu News