విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రెండు తెలుగు రాష్ట్రాలకు రూ.10 లక్షలు చొప్పున మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ విరాళం అందచేశారు. ఢిల్లీ లో రెండు రాష్ట్రాల రెసిడెంట్ కమిషనర్లకు ఈ మేరకు బుధవారం చెక్కులు అందచేసారు.కష్ట కాలంలో మనకు చేతనైనంత సాయం చేయాలని ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ పిలుపు నిచ్చారు. సమాజం కోసం అందరూ ముందుకొచ్చి ఆదుకోవాలన్నారు. ఇద్దరు సీఎంల నిర్విరామ కృషికి మద్దతుగా నిలవ వలసిన అవసరం ఉందని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. కష్టాల్లో ఉన్న తెలుగు ప్రజలను ఆదుకోవాలని ప్రతి ఒక్కరినీ చేతులు జోడించి ప్రార్థిస్తున్నానన్నారు.
Tags vijayawada
Check Also
మద్దిరాలపాడు పర్యటనలో…
ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …