విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణలంక ప్రాంతంలోని బ్రమరాంబ పురానికి చెందిన పి.చంద్రశేఖర్ బుడమేరు వాగులో కొట్టుకు పోయి చనిపోయిన పి.చంద్రశేఖర్ కుటుంబాన్ని రాష్ట్ర గృహ నిర్మాణం,సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి గురువారం పరామర్శించారు. ఎంబిఎ చదువుకున్న చంద్రశేఖర్ తన డైరీ ఫారంలో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులను వరదల నుంచి కాపాడి ప్రమాదవాసాత్తు తను వాగులో కొట్టుకు పోయి మరణించారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి పార్ధసారధి ఆ కుటుంబ సభ్యులను పరామర్శించి కుటుంబ సభ్యులను ధైర్యంగా ఉండాలని ఓదార్చారు. ప్రభుత్వ పరంగా అందాల్సిన సహాయం అందుతుందని, భాధిత కుటుంబానికి ప్రభుత్వం ఆండగా ఉంటుందని హామీ ఇచ్చారు. చంద్రశేఖర్ డైరీ ఫారంలోని 40 ఆవులు గేదెలు ఈ వరదలో కొట్టుకు పోయాయి.కృష్ణ లంకలోని రామాదేవి నగర్ కట్ట వద్ద వరద బాధితులకు ఆహారం,మంచి నీరు,పాలు పంపిణీ చేశారు. మంత్రి పార్థసారథి వెంట చింతలపూడి మాజీ శాసన సభ్యులు గంటా మురళి తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
మద్దిరాలపాడు పర్యటనలో…
ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …