Breaking News

ఈనెల 28న చంద్రబాబు పాప ప్రక్షాళనకు పూజ‌లు : మల్లాది విష్ణు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా తిరుమల లడ్డూ ప్రసాదంపై కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు ఆరోపించారు. తిరుమల పవిత్రతను, ప్రసాదం విశిష్టతను అపవిత్రం చేసిన చంద్రబాబు పాపానికి ప్రక్షాళనగా.. ఈనెల 28 న రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల్లో పూజలకు పార్టీ అధిష్టానం పిలుపునిచ్చినట్లు తెలిపారు. ఇందులో భాగంగా శనివారం ఉదయం 9.30 గంటలకు సత్యనారాయణపురం గాయత్రీ కన్వెన్షన్ సెంటర్ ప్రక్కన ఉన్న ఆంజనేయస్వామి ఆలయం నందు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించారు. కావున భక్తులు, పార్టీ శ్రేణులు పెద్దసంఖ్యలో కార్యక్రమంలో పాల్గొనాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

Check Also

ప్రతి పేదవాడు పక్కా ఇల్లు నిర్మించుకుని గౌరవంగా జీవించాలి…

మొవ్వ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ప్రతి పేదవాడు పక్కా ఇల్లు నిర్మించుకుని గౌరవంగా జీవించాలని ప్రభుత్వ లక్ష్యమని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *