విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నిరుపేద రోగులకి వైద్య విషయంలో ఎలాంటి జాప్యం జరగకూడదని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) తను వైజాగ్ లో వుండటంతో..సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన రూ.2.50 లక్షల లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్.వో.సి) లెటర్ ను సోమవారం తన కార్యాలయంలో ఇచ్చే ఏర్పాటు చేశారు. తిరువూరు నియోజకవర్గం ఎ.కొండూరు మండలం గొల్లమంద్ల గ్రామానికి చెందిన నల్లిబోయిన లక్ష్మీ కి బ్రెయిన్ సర్జరీకి అవసరమైన వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరైన రూ.2.50 లక్షల ఎల్.వో.సి లేటర్ ను నల్లిబోయిన లక్ష్మీ భర్త నల్లిబోయిన శ్రీనివాసరావు కి ఎంపి కార్యాలయ సిబ్బంది అందజేశారు.. హైదరాబాద్ యశోదా హాస్పటల్ లో చికిత్స పొందుతున్న తన భార్య లక్ష్మీ వైద్యానికి సీఎంఆర్ ఎఫ్ ద్వారా సాయం అందించినందుకు ఎంపి కేశినేని శివనాథ్ కి, ఎంపి కార్యాలయ సిబ్బందికి నల్లిబోయిన శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ముల్పూరి కిషోర్, బాలినేని మోహన్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News