విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దీపావళి సందర్బంగా ఈరోజు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ప్రధానాలయం నందు శ్రీ అమ్మవారికి ఆలయ వైదిక సిబ్బంది “ధనలక్ష్మి” పూజ శాస్త్రోక్తముగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమం నందు ఆలయ ఈవో కె ఎస్ రామరావు దంపతులు పాల్గొని శాస్త్రోక్తముగా పూజలు నిర్వహించారు. తదుపరి ప్రదోష కాలం నందు శ్రీ అమ్మవారికి సా. 06 గం. లకు ప్రతిరోజూ నిర్వహించు పంచహారతుల సేవ నిర్వహించిన అనంతరం దీపావళి సందర్బంగా ఆలయ ప్రాంగణములు మొత్తం దీపములు ప్రజ్వలన కార్యక్రమం, బాణాసంచాలు వెలిగించి, అనంతరం ఆలయ తలుపులు ‘కవాట బంధనం’ చేయబడును. తిరిగి రేపు యధావిధిగా దర్శనం ప్రారంభమగును అని ఈవో ఒక ప్రకటనలో తెలియున్నారు.
Prajavartha Online Telugu News