-సీడీపీవోలు జి. మంగమ్మ, టి. నాగమణి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని ఐసిడిఎస్ ప్రోజెక్టుల పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు, మిని అంగన్వాడీ కార్యకర్తలు, అంగన్వాడీ సహాయకురాల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందని అర్హులైన అభ్యర్థులు ఉద్యోగ నియామకానికి దరఖాస్తు చేసుకోవాలని విజయవాడ రూరల్ మరియు అర్బన్ ప్రోజెక్టుల సీడీపీవోలు జి. మంగమ్మ, టి. నాగమణి లు ప్రకటనలో కోరారు. జిల్లాలోని విజయవాడ (రూరల్) ప్రాజెక్ట్ పరిధిలో రాయనపాడు 3 నందు ఎస్సీ కేటగిరి, …
Read More »Tag Archives: amaravathi
ఉపాధి హామీ పనుల నాణ్యతలో రాజీ వద్దు
-ప్రతి దశలోనూ నాణ్యతా ప్రమాణాలు తనిఖీ చేయాలి -రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామ పంచాయతీల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీపడకూడదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఉపాధి హామీతోపాటు 15వ ఆర్థిక సంఘం నుంచి నిధులు వచ్చిన క్రమంలో వాటిని సక్రమంగా, …
Read More »28 అక్టోబర్ నుండి 30 అక్టోబర్ తారీకు వరకు విజయవాడ నగరంలో దీపావళి విత్ మై భారత్ కార్యక్రమాలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ మరియు కేంద్రం మై భారత్ డిపార్ట్మెంట్ ఆదేశాల మేరకు మైభారత్ పోర్టల్ లాంచ్ అవి సంవత్సరకాలం ముగుస్తున్నందున దీవాలి విత్ మై బారత్ అనే కార్యక్రమంలో చేపట్టడం జరుగుతుందని నెహ్రూ కేంద్ర జిల్లా యువ అధికారి ధికారి సుంకర రాము ఓ ప్రకటనలో తెలిపారు. దీవాలి విత్ మై బారత్ మేరా యువభారత్ ప్రోగ్రాం లో భాగంగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరంలో ఈనెల 28 న …
Read More »టీడీపీ ఆవిర్భావంతోనే తెలుగుజాతికి గుర్తింపు, గౌరవం
-టీడీపీ పొలిటికల్ యూనివర్సిటీ… ఏ ముఖ్య నాయకుడిని చూసినా మూలాలు టీడీపీలోనే -టీడీపీ పనైపోయిందన్న వారి పనే అయిపోయింది -మొన్న జరిగింది ఎన్నికలు కాదు…రాక్షసుడితో యుద్ధం -ప్రజల ఆకాంక్షలను నెరవేర్చుతాం…కార్యకర్తల మనోభావాలను గౌరవిస్తాం -ఇసుక, మద్యంలో ఎవరూ తలదూర్చొద్దు… ఎవరు తప్పుచేసినా పార్టీకి చెడ్డపేరు -ఎమ్మార్పీ రేట్లకు మించి మద్యం విక్రయిస్తే చర్యలు తప్పవు -టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు -మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సభ్యత్వ నమోదును ప్రారంభించిన చంద్రబాబు -తొలి సభ్యత్వం తీసుకున్న టిడిపి అధినేత అమరావతి, నేటి …
Read More »పేదలను స్వపరిపాలన అధికార దిశగా నడిపించాలి… : విజయ్ కుమార్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తాడేపల్లి లిబరేషన్ కాంగ్రెస్స్ పార్టీ ఆఫీసులో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు విజయ్ కుమార్ ఐ ఏ ఎస్ (R) విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వ ఏర్పడి ఐదు నెలల పూర్తయింది ప్రభుత్వం కుదురుకోవడానికి కొంత సమయం ఇవ్వాలి కాబట్టి మా పార్టీ తరపున సమయం ఇచ్చామని ఐడియాలజీతో, విలువలు, సిద్ధాంతాలకు కట్టుబడి లిబరేషన్ కాంగ్రెస్స్ పార్టీ పనిచేస్తుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసి, మైనారిటీలోని పేదలను స్వపరిపాలన అధికార దిశగా …
Read More »సమిష్టి కృషితో జిల్లాను అభివృద్ధి చేద్దాం
-రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పార్వతీపురం , నేటి పత్రిక ప్రజావార్త : సమిష్టి కృషితో జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్దామని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమం మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి జిల్లా అధికారులకు పిలుపునిచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లా గిరిజన ప్రాంతమని, అధిక శాతం గిరిజనులుండే ఈ ప్రాంతాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం సంకల్పించినట్టు చెప్పారు. అందులో భాగంగా ఐటిడిఏలను పునరుద్దరించి, తద్వారా గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశ్యంతో …
Read More »జగన్ రెడ్డి చేసిన పాపాలే ప్రజల మెడకు ఉరితాళ్లు
-ఇంధన సర్దుబాటు చార్జీల పాపం జగన్ రెడ్డిదే -జగన్ హయాంలోనే వసూళ్లకు అనుమతి కోరిన డిస్కంలు -వాయిదా వేస్తూ… కమిషన్ ముగిసే మూడు రోజుల ముందుగా వసూళ్లకు ఆదేశాలు -విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విద్యుత్ రంగంలో జగన్ రెడ్డి చేసిన పాపాలే నేడు రాష్ట్ర ప్రజల పాలిట ఉరితాళ్లు అయ్యాయని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మండిపడ్డారు. గత ఐదేళ్లలో జగన్ రెడ్డి తీసుకున్న అనాలోచిత నిర్ణయాల కారణంగా ప్రస్తుతం ప్రజల మీద …
Read More »7 గురు ప్రభుత్వ వైద్య కళాశాల (పిన్సిపాళ్ళు), GGH సూపరింటెండెంట్ల బదిలీలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రెండవ దశలో మంజూరైన 4 ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రత్యామ్నాయ మార్గాల్లో చేపట్టాలని తలపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఆయా కళాశాలల ప్రిన్సిపల్స్, టీచింగ్ ఆసుపత్రుల సూపరింటెండెంట్లను బదిలీ చేయాలని నిర్ణయించింది. వివరాలు : 1) మార్కాపురం ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డా.ఎస్.వీఎన్. రాజమన్నార్, (అనాటమి) నెల్లూరు ఎసిఎస్ఆర్ జీఎంసీ, ప్రిన్సిపల్ గా బదిలీ 2) పులివెందుల ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ గా ఉన్న డా. శ్రీదేవి (ఎస్పీఎం) నంద్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్గా …
Read More »సుందర పార్వతిపురం ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించిన మంత్రి
పార్వతీపురం, నేటి పత్రిక ప్రజావార్త : సుందర పార్వతీపురం కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆర్ట్ గ్యాలరీని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ మంత్రి మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి శనివారం ప్రారంభించారు. సుందర పార్వతీపురం రూపొందాలని ఆమె ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరు ఇందులో భాగస్వామ్యమై జిల్లా వ్యాప్తంగా పరిశుద్ధ వాతావరణం ఏర్పాటు చేయడంతో పాటు సుందరమైన ప్రకృతి సోయగల పరిసరాలను రూపకల్పనకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ …
Read More »రేపు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం
-సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించనున్న టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అక్టోబర్ 26 నుండి తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా ప్రారంభమవుతుంది. టీడీపీ కేంద్ర కార్యాలయం లో పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో రూ.లక్ష రూపాయలు కట్టిన వారికి టీడీపీ నుండి శాశ్వత సభ్యత్వం అందించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు …
Read More »