Breaking News

Tag Archives: amaravathi

​శ్రీ క్షేత్ర ధర్మస్థల మంజునాథ స్వామిని దర్శించుకున్న వెలంపల్లి శ్రీనివాసరావు మరియు మల్లాది విష్ణు 

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అత్యంత పురాతనమైన మరియు మహిమాన్వితమైన పుణ్యక్షేత్రం, దాదాపు 800 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయం శ్రీ క్షేత్ర ధర్మస్థలను శనివారం మాజీ మంత్రి, ​విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైసిపి ఇన్-ఛార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు మరియు మాజీ ఎమ్మెల్యే, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైసిపి ఇంచార్జ్ ఇన్-ఛార్జ్ మల్లాది విష్ణు సందర్శించారు. శ్రీ క్షేత్ర ధర్మస్థల మంజునాథ స్వామిని దర్శించుకున్నారు. ​అనంతరం వారు స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Read More »

నూజివీడులో ఆదివారం మంత్రి సవిత పర్యటన

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నేడు (ఆదివారం) ఏలూరు జిల్లా నూజివీడులో రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత పర్యటించనున్నారు. రేనాటి వీరుడు, వడ్డెర సామాజిక వర్గానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డే ఓబన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆమె పాల్గొనున్నట్లు మంత్రి కార్యాలయం తెలిపింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. మొట్టమొదటి సిపాయిల తిరుగుబాటుకు (1857) ముందే బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా వడ్డే ఓబన్న పోరాటం జరిపారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సైన్యానికి …

Read More »

ముస్లింలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రంజాన్ శుభాకాంక్షలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరసోదరీమణులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇస్లాం మతంలో అత్యంత పవిత్రమైన ఈ రంజాన్ నెలలో ఉపవాసదీక్షలు, ప్రార్థనలు మనసును పవిత్రం చేసుకోవడానికి, మంచి మార్గంలో నడవడానికి, పరస్పర ప్రేమాభిమానాలను పెంపొందించడానికి ఒక మంచి అవకాశం. పేదలకు దానం చేయడం ద్వారా సమాజంలో సమానత్వం పెరుగుతుంది. ఈ రంజాన్ మీ జీవితంలో ఆనందం, శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం నింపాలని ఆకాంక్షిస్తున్నాను. మీరు చేసే ప్రతి ప్రార్థనకు అల్లాహ్ ఆశీస్సులు లభించి, మీ …

Read More »

రెండు రోజుల్లో పంట నష్టంపై పూర్తి నివేదిక సమర్పించండి

-ఎల్పీజీ సిలిండర్ల సరఫరాకు అంతరాయం రానివ్వొద్దు -అకాల వర్షాలు, గ్యాస్ సరఫరాపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష -జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ -ఇప్పటివరకు పంట నష్టాన్ని రూ.63 కోట్లుగా లెక్కించిన అధికారులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారీ గాలులు, అకాల వర్షాలు, వడగళ్లతో రాష్ట్రంలో సంభవించిన పంట నష్టంపై రెండు రోజుల్లో పూర్తి స్థాయి అంచనాలు రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దీనిపై శుక్రవారం క్యాంప్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు …

Read More »

గోదావరిలో విద్యార్థుల గల్లంతుపై సీఎం చంద్రబాబు ఆరా

-ఘటనపై అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పోలవరం జిల్లా ఎటపాక మండలం పురుషోత్తపట్నం రేవు వద్ద గోదావరిలో విద్యార్థుల గల్లంతుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. ఘటనపై అధికారులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. స్నానం చేసేందుకు ఏడుగురు విద్యార్థులు గోదావరిలోకి దిగారని, వారిలో ఐదుగురు గల్లంతయ్యారని అధికారులు వివరించారు. గల్లంతైన వారిలో అభిరామ్, శ్రీకర్, నవదీప్ అనే విద్యార్థులు ముగ్గురు మృతి చెందారని, మిగిలి ఇద్దరు విద్యార్థులైన సతీష్ కుమార్, తేజ ఆచూకీ కోసం గాలింపు …

Read More »

రంజాన్ సెలవు 21వ తేది శనివారం:సిఎస్ సాయి ప్రసాద్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రంజాన్ (Eid-Ul-Fitr)సందర్భంగా ప్రభుత్వం ప్రటించిన సెలవు దినం శుక్రవారానికి బదులు ఈనెల 21వ తేది శనివారానికి మారుస్తూ గురువారం జిఓ ఆర్టి సంఖ్య:612 ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.రంజాన్ పర్వదినం సందర్భంగా ఈనెల 20వ తేదీ శుక్రవారం సెలవు దినంగా ప్రభుత్వం గతంలో ప్రకటించడం జరిగిందని అయితే శుక్రవారం నెలవంక(Sighting of the moon)కనిపించని కారణంగా వక్ఫ్ బోర్డు ముఖ్య కార్య నిర్వహణాధికారి విజ్ఞప్తి మేరకు రంజాన్ సాధారణ సెలవును …

Read More »

ఉగాది కానుకగా యువతకు జాబ్ క్యాలెండర్

– మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర యువతకు ఉగాది పండుగ సందర్భంగా కూటమి ప్రభుత్వం గొప్ప కానుకగా జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయడం హర్షణీయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. మంత్రి నారా లోకేష్ విడుదల చేసిన 10,060 పోస్టులతో కూడిన జాబ్ క్యాలెండర్ నిరుద్యోగ యువతకు కొత్త ఆశలను నింపిందన్నారు. ఇది నిరుద్యోగులకు నిజమైన ఉగాది పండుగగా మారిందని పేర్కొన్నారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని మంత్రి లోకేష్ కచ్చితంగా …

Read More »

సహనం, ప్రేమ, దయ, సోదరభావం, పరోపకారం, సంతోషం ల కలయికే రంజాన్

-శుభాకాంక్షలు తెలిపిన మైనారిటీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సహనం, ప్రేమ, దయ, సోదరభావం, పరోపకారం, సంతోషం ల కలయికే రంజాన్ అని ఈ సుగుణాలన్నీ ప్రజలకు భగవంతుడు ప్రసాదించాలని కోరుతూ ప్రజలకు మైనారిటీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. నెలరోజుల ఉపవాస దీక్షల అనంతరం, నెలవంక అగుపించడంతో శనివారం దేశవ్యాప్తంగా రంజాన్ నిర్వహించుకుంటున్న సందర్భంగా ఈద్-ఉల్-ఫితర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మంత్రి ఫరూక్ అమరావతిలో శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ముస్లింల పవిత్ర గ్రంథం …

Read More »

బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉత్తరాంధ్ర తీరప్రాంతం, పశ్చిమమధ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దీనితో పాటుగా కర్ణాటక మరియు తమిళనాడు మీదుగా ద్రోణి విస్తరించి ఉందని తెలిపారు. దీని ప్రభావంతో రేపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో తేలికపాటి …

Read More »

వర్షపు నీటి ప్రవాహాల నిర్వహణ సమర్ధవంతంగా జరగాలి… : కమిషనర్ కె.కన్నబాబు ఐఏఎస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : APCRDA కమిషనర్ కె.కన్నబాబు ఐఏఎస్ శుక్రవారం అమరావతిలో పలు ప్రాజెక్టులను పర్యవేక్షించారు. కొండవీటి వాగు, అనుబంధ కాల్వలు, కృష్ణాయపాలెం రిజర్వాయర్ తదితర ప్రాంతాలను కమిషనర్ CRDA ఇంజినీర్-ఇన్-చీఫ్ ఆర్.గోపాలకృష్ణారెడ్డి, ఇంజినీరింగ్ విభాగ అధికారులు, ఇతర అధికారులతో కలసి పర్యవేక్షించారు. ఇటీవల కురిసిన ఆకస్మిక వర్షం కారణంగా ఏర్పడిన నీటి ప్రవాహాలను కమిషనర్ పరిశీలించారు. ఆయా నిర్మాణ పనులు జరిగే ప్రాంతాలలో, వర్షపు నీటి ప్రవాహాల నిర్వహణ సమర్ధవంతంగా జరగాలని కమిషనర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనులకు …

Read More »