Breaking News

Tag Archives: amaravathi

ఎండ తీవ్రత రికార్డు స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఎండ తీవ్రత రికార్డు స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. సోమవారం వరకు ఎండ తీవ్రత కొనసాగే అవకాశం ఉందని వీలైనంత వరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 మధ్య ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. ఇవాళ పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో గరిష్ఠ ఉష్ణోగ్రత 48.1 డిగ్రీలు నమోదైందని, 18 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు దాటినట్లు తెలిపారు. …

Read More »

బీసీ గురుకుల విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్లు, ట్రాక్ సూట్లు

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తాడేపల్లి/అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విద్యతో పాటు క్రీడలు విద్యార్థులకు ఎంతో అవసరమని, దీన్ని దృష్టిలో పెట్టుకునే బీసీ గురుకులాలు విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్లు, ట్రాక్ సూట్, షూస్ అందజేయనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. క్రీడలు మానసిక ఉల్లాసం కలిగించడంతో పాటు వాటిలో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సవితను జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో విజేతలుగా …

Read More »

బక్రీద్ సెలవు ఈనెల 28న-ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్ సాయి ప్రసాద్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బక్రీద్(Eid-ul-Adha)సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 28వ తేది గురువారం సాధారణ సెలవు దినంగా ప్రకటించింది.ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ జిఓఆర్టీ సంఖ్య:1006 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు.బక్రీద్ పర్వదిన్నాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం గతంలో ఈనెల 27వ తేది బుధవారం సెలవు దినంగా ప్రకటించడం జరిగింది.అయితే నెలవంక(Sighting of the moon)ఆధారంగా ముస్లిం సమాజం బక్రీద్ వేడుకను ఈనెల 27కు బదులుగా 28 గురువారం నిర్వహించుకోనునన్నారని విజయవాడ రాష్ట్ర వక్ఫ్ బోర్డు ముఖ్య కార్య నిర్వహణాధికారి …

Read More »

ప్రజారాజధాని అమరావతిలో పర్యటించిన బ్రిటిష్ డిప్యూటీ హై కమిషన్ జి వాన్ ఓవెన్

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : డిప్యూటీ హై కమిషనర్(బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్) జి వాన్ ఓవెన్, డిపార్ట్మెంట్ ఆఫ్ బిజినెస్ & ట్రేడ్ , పార్ట్నర్‌షిప్స్ డైరెక్టర్ చజ్ వాలియా గురువారం ప్రజారాజధాని అమరావతిలో పర్యటించారు. తొలుత వారు అమరావతి సచివాలయంలో మునిసిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.సురేష్ కుమార్‌ ఐఏఎస్, APCRDA కమిషనర్ వి. విజయ రామరాజు ఐఏఎస్, అడిషనల్ కమిషనర్ కొల్లాబత్తుల కార్తీక్ ఐఏఎస్ తో భేటీ అయ్యారు. అమరావతిని సుస్థిరమైన, సమగ్రమైన, ప్రపంచ స్థాయి ప్రజారాజధానిగా అభివృద్ధి …

Read More »

APCRDA ఆధ్వర్యంలో “అందరికీ అందుబాటులో ఉండే సమగ్ర అమరావతి నగర అభివృద్ధి”పై వర్క్‌షాప్ నిర్వహణ

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతి నగరాన్ని అందరికీ అందుబాటులో ఉండే, సమగ్రమైన రాజధానిగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(APCRDA) 2026 మే 21న రాయపూడిలో APCRDA ప్రాజెక్టు కార్యాలయంలో “డెవలపింగ్ అమరావతి యాజ్ ఏ మోడల్ సిటీ ఆఫ్ యాక్సెసిబిలిటీ & ఇన్‌క్లూజన్” అనే అంశంపై వర్క్‌షాప్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో 80 మందికి పైగా ఆర్కిటెక్టులు, ప్లానర్లు, ఇంజినీర్లు, కన్సల్టెంట్లు, సంబంధిత రంగంలోని నిపుణులు, వివిధ సంస్థల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అందరికీ …

Read More »

కృష్ణాయపాలెంలో గ్రామసభ నిర్వహించిన APCRDA

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతి నగర నిర్మాణం నిమిత్తం భూసేకరణ కార్యకలాపాలకై కృష్ణాయపాలెంలో APCRDA ఆధ్వర్యంలో గురువారం గ్రామసభ జరిగింది. నేడు జరిగిన గ్రామసభలో కమిషనర్ వి.విజయరామరాజు ఐఏఎస్, అడిషనల్ కమిషనర్లు ఏ.భార్గవతేజ ఐఏఎస్ హాజరయ్యారు. రాజధాని నగరంలో నిర్మిస్తున్న రహదారులు, LPS జోన్లు, తదితర అభివృద్ధి ప్రాజెక్టుల నిమిత్తం భూసమీకరణ(ల్యాండ్ పూలింగ్- LPS) చేపట్టామని.. సమీకరణకు కొందరు రైతులు, భూయజమానులు ముందుకు రానందున..రైతులతో పలుమార్లు చర్చించిన అనంతరం నిర్ణీత విధానంలో మాత్రమే ఇటీవల భూసేకరణ ప్రక్రియకై నోటిఫికేషన్ విడుదల …

Read More »

గనుల రంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు

-ఇసుక సరఫరాలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు -ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా అధికారులు పని చేయాలి -రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర కర్నూలు, నేటి పత్రిక ప్రజావార్త : గనుల రంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, ఇసుక సరఫరాలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని,ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా అధికారులు పని చేయాలని రాష్ట్ర గనుల, భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర …

Read More »

కుప్పం గంగమాంబకు సారె సమర్పించిన సీఎం దంపతులు

కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : చిత్తూరు జిల్లా కుప్పం పట్టణం లోని శ్రీ ప్రసన్న తిరు పతి గంగమాంబకు ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు దంపతులు తితిదే తరపున సారె, పట్టువస్త్రాలు సమర్పించారు. జాతర చివరి రోజు బుధవారం అమ్మవారి విశ్వరూపాన్ని దర్శించుకుని, వేద పండితుల ఆశీర్వచనం పొందారు. ముఖ్యమంత్రి దంపతులు గంగమ్మ ఆలయానికి రాగా అర్చ కులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. దర్శనం అనంతరం సీఎం పలువురు భక్తులతో మాట్లాడారు.

Read More »

దేశ ప్రగతి ఎంత ముఖ్యమో… ప్రజల ఆరోగ్యం అంతే ముఖ్యం

-పరిశ్రమలు ప్రభుత్వ నిబంధనలు పాటించాల్సిందే -గ్రీన్ బెల్ట్ నిర్వహణ, శబ్ద కాలుష్య నియంత్రణ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి -కాలుష్యాన్ని నియంత్రించి గోస్తని నదిని కాపాడుదాం -కాలుష్య నియంత్రణ మండలి తనిఖీల్లో బాధితులను భాగస్వామ్యం చేయాలి -కాలుష్య నియంత్రణ మండలి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : దేశ పురోగతికి పరిశ్రమలు ఎంత అవసరమో… ప్రజల ఆరోగ్యం, పర్యావరణాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమని ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ, శాస్ర్త సాంకేతికల శాఖ మంత్రి …

Read More »

తాగు నీటి నాణ్యతపై రాజీపడొద్దు

-నెల రోజుల్లోగా ఫిల్టర్ బెడ్ల క్లీనింగ్ పూర్తి కావాలి -పనులు పూర్తయ్యేలా కలెక్టర్లు పర్యవేక్షించాలి -గృహ అవసరాలకూ పూర్తి స్థాయిలో శుద్ధి చేసిన నీరు -వసతి గృహాలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో నీటి నాణ్యత పరిశీలనకు ఎఫ్టీకే కిట్ల ఏర్పాటు -గ్రామీణ నీటి సరఫరా శాఖ ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామీణ ప్రాంతాల్లో తాగు నీటి నాణ్యతను పెంచడానికి, ప్రజల ఆరోగ్య రక్షణకు ప్రతి పంచాయతీలో ఉన్న ఫిల్టర్ బెడ్లను నెల …

Read More »