Breaking News

Tag Archives: amaravathi

సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఐఎండి సూచనల ప్రకారం ఈ 2026 వేసవిలో మార్చి నుంచి మే వరకు సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. అలాగే కనిష్ఠ ఉష్ణోగ్రతలు రాయలసీమ, ఉత్తరాంధ్ర కొన్ని జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. మార్చి నెలలో సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు …

Read More »

వేట్లపాలెం బాణాసంచా ప్రమాద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి కందుల దుర్గేష్

-డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఘటనాస్థలిని పరిశీలించిన మంత్రి దుర్గేష్, ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ -క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశం -మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి – ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా కాకినాడ, నేటి పత్రిక ప్రజావార్త : కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో జరిగిన బాణాసంచా తయారీ కేంద్రం పేలుడు ఘటన అత్యంత హృదయవిదారకమని పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నిడదవోలు …

Read More »

సిఎస్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన జి.సాయి ప్రసాద్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జి.సాయి ప్రసాద్ శనివారం ఎపి సచివాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు.ఇప్పటి వరకు సిఎస్ గా పని చేసిన కె.విజయానంద్ శనివారం పదవీ విరమణ చేస్తుండడంతో ఆయన నుండి సాయి ప్రసాద్ సిఎస్ గా బాధ్యతలు స్వీకరించారు. ముందుగా తిరుమల తిరుపతి దేవస్థానం మరియు విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానాల వేద పండితుల ఆశ్వీర్వచనాల మధ్య ప్రత్యేక పూజా కార్యక్రమం అనంతరం ఉ.11.33 గం.లకు సిఎస్ గా పదవీ …

Read More »

సామర్లకోటలో భారీ బాణసంచా పేలుడు – తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు

-జిల్లా ఎస్పీ, కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి ఘటనపై వివరాలు తెలుసుకున్న ఎంపీ -హైదరాబాద్ నుంచి సహాయక చర్యల పర్యవేక్షణకు హుటాహుటిన బయలుదేరిన రాజ్యసభ సభ్యులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో ఉన్న బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనతో ప్రాంతంలో ఆందోళన వాతావరణం నెలకొంది. ఈ దుర్ఘటనపై రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు తీవ్ర …

Read More »

క‌ఠిన వైఖ‌రి కార‌ణంగా ‘విల‌న్ ‘ గా చూస్తున్నారు

-ఆరోగ్య వ్య‌వ‌స్థ‌ను గాడిన పెట్టేందుకు త‌ప్ప‌ద‌న్న వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్‌ -మ‌రో రెండేళ్ల‌ల్లో పూర్తి స్థాయి ఫ‌లితాలు -సిఎం చంద్ర‌బాబుతో ప‌నిచేయ‌డం నిరంత‌రాభ్యాసం కూట‌మి స‌జావుగా ముందుకు సాగుతోంద‌న్న మంత్రి అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : గ‌త వైసిపి ప్ర‌భుత్వ ఐదేళ్ల పాల‌న‌లో గాడి త‌ప్పిన ప్ర‌జారోగ్య వ్య‌వ‌స్థ‌ను తిరిగి ప‌ట్టాలెక్కించేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నాల్లో భాగంగా ప‌లు అంశాల‌పై క‌ఠిన వైఖ‌రిని అవలంబిస్తున్నందున త‌న‌ను సంబంధిత వ‌ర్గాల్లో ‘విల‌న్ ‘ గా చూస్తున్నార‌ని వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ …

Read More »

సీఎం పై వైసీపీ వారు పెట్టిన అసభ్యకరమైన పోస్టుపై డీజీకి ఫిర్యాదు

-టీడీపీ నేతల మీడియా స‌మావేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 2024 ఎన్నికల్లో ప్రజలు ఘోరంగా ఓడించి 11 సీట్లకే పరిమితం చేసినా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి లో మార్పు రాలేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మండిపడ్డారు. అధికారం పోవడంతో జగన్ తీవ్రమైన ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారని, నిద్ర ఆహారాలు మాని ఏ రకంగానైనా చంద్రబాబు ని దించి మళ్ళీ సీఎం కుర్చీ ఎక్కాలని అడ్డదారులు తొక్కుతున్నారని ఆయన విమర్శించారు. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో …

Read More »

గత ప్రభుత్వంలో ఏయూని వైసీపీ కార్యాలయంగా మార్చేశారు!

-విజిలెన్స్ నివేదిక వచ్చాక మాజీ వీసీ ప్రసాదరెడ్డిపై కఠినచర్యలు -శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తాం: శాసనసభలో మంత్రి లోకేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గత వైసీపీ ప్రభుత్వంలో ఆంధ్ర యూనివర్సిటీని వైసీపీ కార్యాలయంగా మార్చేశారని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో విశాఖ సిటీ ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ… ఆంధ్రా యూనివర్సిటీలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై చర్యలు చేపట్టాలని, వర్సిటీలోని వివిధ వసతి …

Read More »

విజయనగరం జిల్లాలో రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన

-చీపురుపల్లిలో HPV వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం -అనంతరం రావివలసలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ -మధ్యాహ్నం ప్రజావేదిక సభలో పాల్గొననున్న ముఖ్యమంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. చీపురుపల్లి నియోజకవర్గంలో నిర్వహించే HPV వ్యాక్సినేషన్, ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉదయం 09.30 గంటలకు అమరావతి నుంచి బయలుదేరి 11.10 గంటలకు చీపురుపల్లి మండలంలోని రావివలస గ్రామానికి చేరుకుంటారు. 11.30 గంటలకు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు చేరుకుంటారు. గర్భాశయ …

Read More »

ఈ ఏడాది చివరికి 10 లక్షల ఇళ్లకు పైగా గృహ ప్రవేశాలు

-ఇళ్లు లేనివారు దరఖాస్తులు చేసుకోవాలి -గత ప్రభుత్వంలో హౌసింగ్‌లో అక్రమాలకు పాల్పడ్డవారిని శిక్షిస్తాం -అగ్రిటెక్, పంచ సూత్రాలతో వ్యవసాయ రంగం బలోపేతం -రాయలసీమను ఉద్యాన హబ్‌గా తీర్చిదిద్దుతాం -వ్యవసాయం, హౌసింగ్ బడ్జెట్ పద్దుపై శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి పేదవానికి సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఇప్పటికే సుమారు 3 లక్షల ఇళ్లకు గృహ వ్రవేశాలు చేపట్టామని… మొత్తంగా ఈ ఏడాది చివరి నాటికి …

Read More »

అధ్యయనం చేసిన తర్వాత కీలక వాస్తవాలు బయటపడ్డాయి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ… డిసెంబర్ 11న ఆర్‌బీఐ విడుదల చేసిన “హ్యాండ్‌బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్” రిపోర్ట్‌ పై వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు ఈ రిపోర్ట్‌ను సరిగ్గా హోంవర్క్ చేయకుండా తమకు అనుకూలంగా ఉందని భావించి ప్రస్తావించారని, కానీ వాస్తవాలు పూర్తిగా భిన్నంగా ఉన్నాయని మంత్రి తెలిపారు. 450 పేజీల రిపోర్ట్‌ను వివరంగా అధ్యయనం చేసిన తర్వాత కీలక వాస్తవాలు బయటపడ్డాయని టీజీ భరత్ వెల్లడించారు. 2019-20లో ఆంధ్రప్రదేశ్‌లో …

Read More »