Breaking News

Tag Archives: amaravathi

జైలు శాఖ అధికారులతో హోం మంత్రి అనిత సమీక్ష సమావేశం

-వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన హోం మంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సచివాలయంలో హోం మంత్రి అనిత జైలు శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమీక్షలో వివిధ అంశాలపై చర్చించారు.రాష్ట్రంలో మొత్తం 106 జైళ్లు (ఫంక్షనింగ్ & నాన్-ఫంక్షనింగ్ కలిపి) ఉండగా, అందులో 25 నాన్-ఫంక్షనింగ్ జైళ్ల వివరాలను ప్రత్యేకంగా జాబితా చేయాలని హోం మంత్రి అనిత అన్నారు. ఉపయోగంలో లేని జైళ్లను మరమ్మతులు చేసి ఇతర జైలు కార్యకలాపాలకు వినియోగించే అవకాశాలపై నివేదిక సిద్ధం చేయాలని అన్నారు. …

Read More »

ఏపీలో 24 గంటల్లోనే కొత్త వాహనాల రిజిస్ట్రేషన్

-వాహనదారులకు వేగవంతమైన సేవలే ప్రభుత్వ లక్ష్యం -జాప్యాలకు చెక్ పెట్టేలా కొత్త విధానం అమలు…రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కొత్త వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఇకపై 24 గంటల్లో పూర్తి చేసే విధంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని రాష్ట్ర రవాణా, యువజన క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి విడుదల చేసిన ప్రకటనలో మంత్రి మాట్లాడుతూ, ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించాలనే …

Read More »

పవన్ కళ్యాణ్ మాటిచ్చారు… కొత్త స్కూలు నిర్మించారు…

–పెదపాడు పాఠశాలకు కొత్త భవనం -అడవితల్లి బాట ప్రారంభోత్సవంలో ఇచ్చిన మాట నిలుపుకొన్న ఉపముఖ్యమంత్రివర్యులు -రూ. 17.50 లక్షలతో భవన నిర్మాణం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అడవితల్లి బాటకు శ్రీకారం చుట్టిన పవన్ కళ్యాణ్ , ఆ కార్యక్రమానికి శంకుస్థాపన చేసిన పెదపాడు గ్రామ విద్యార్ధుల కోసం నూతన పాఠశాల భవన నిర్మాణానికి ఇచ్చిన హామీ కార్యరూపం దాల్చింది. రూ. 17.50 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన నూతన భవనంతో ఆ గ్రామ విద్యార్ధులు, ప్రజలకు ఇచ్చిన మాట నిలుపుకొన్నారు. గత …

Read More »

కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో ఎండ ప్రభావం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో ఎండ ప్రభావం చూపుతుందని వెల్లడించారు. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం అదే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉందని, ఇది రాగల 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందన్నారు. అల్పపీడనం నుండి ఉత్తర తమిళనాడు, రాయలసీమ, కర్ణాటక మీదుగా మరాఠ్వాడా వరకు ద్రోణి విస్తరించి ఉందని తెలిపారు. వీటి ప్రభావంతో బుధవారం (13-05-26) …

Read More »

WB బృందంతో సమావేశాలు

-WB బృందంతో సమావేశాలు నిర్వహించిన APCRDA కమిషనర్ వి. విజయరామరాజు ఐఏఎస్, అడిషనల్ కమిషనర్(FAC) జి.సూర్యసాయి ప్రవీణ్ చంద్ ఐఏఎస్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ బ్యాంకు(WB) బృందం ప్రజారాజధాని అమరావతి అభివృద్ధి పురోగతిపై సమీక్షించేందుకు 2026 మే 11 నుంచి 12 వరకు 2 రోజులపాటు అమరావతిలో పర్యటించింది. WB ఆర్థిక సహకారంతో అమలవుతున్న రాజధాని అమరావతి అభివృద్ధి ప్రాజెక్టు పురోగతిని సమీక్షించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు బ్యాంకు బృందం పేర్కొంది. రాయపూడిలోని సిఆర్డిఏ ప్రధాన కార్యాలయ ఫస్ట్ ఫ్లోర్ …

Read More »

ఐనవోలు, మల్కాపురంలో గ్రామసభ నిర్వహించిన APCRDA..హాజరైన అడిషనల్ కమిషనర్ ఏ.భార్గవతేజ ఐఏఎస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతి నగర నిర్మాణం నిమిత్తం భూసేకరణ కార్యకలాపాలకై ఐనవోలు, మల్కాపురం గ్రామాలలో APCRDA ఆధ్వర్యంలో మంగళవారం గ్రామసభ జరిగింది. నేడు జరిగిన గ్రామసభలో అడిషనల్ కమిషనర్ ఏ.భార్గవతేజ ఐఏఎస్, డైరెక్టర్- ల్యాండ్స్(క్యాపిటల్ సిటీ) ఎన్. వసంతరాయుడు, ఇతర APCRDA అధికారులు హాజరయ్యారు. రాజధాని నగరంలో నిర్మిస్తున్న రహదారులు, LPS జోన్లు, తదితర అభివృద్ధి ప్రాజెక్టుల నిమిత్తం భూసమీకరణ(ల్యాండ్ పూలింగ్- LPS) చేపట్టామని.. సమీకరణకు కొందరు రైతులు, భూయజమానులు ముందుకు రానందున..రైతులతో పలుమార్లు చర్చించిన అనంతరం నిర్ణీత …

Read More »

ఘనంగా ‘భారతీయ హిందూ పరిషత్’ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి వేడుకలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : హనుమాన్ జయంతిని పురస్కరించుకుని మంగళవారం ‘భారతీయ హిందూ పరిషత్’ గుంటూరు జిల్లా తరఫున జిల్లావ్యాప్తంగా పలు ఆంజనేయ స్వామి దేవస్థానాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ‘భారతీయ హిందూ పరిషత్’ క్రియాశీలక సభ్యులు ఆంజనేయ స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రజలు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో వుండాలని ఆకాంక్షించి శుభాకాంక్షలు తెలిపారు. పలువురు హిందూ ప్రముఖులను, దేవాలయాల నిర్వాహకులను సన్మానించి సత్కరించారు. అన్నప్రసాద వితరణ కార్యక్రమాలలో తమవంతు సహాయ …

Read More »

ఎయిమ్స్ లో 2026 అగ్నిమాపక భద్రతా వారోత్సవాలు & అవగాహన కార్యక్రమాలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎయిమ్స్ మంగళగిరిలో 2026 మే 4 నుండి 10 వరకు “సురక్షిత ఆసుపత్రి, సురక్షిత రోగి, సురక్షిత సిబ్బంది – అగ్ని ప్రమాదాల నివారణ కోసం అందరం కలిసికట్టుగా” అనే ఇతివృత్తంతో అగ్ని భద్రతా వారోత్సవాలు 2026 నిర్వహించబడ్డాయి. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ & సీఈఓ అయిన ప్రొఫెసర్ (డా.) అహంతేమ్ శాంతా సింగ్ మరియు డీన్ (అకాడమిక్స్), ప్రొఫెసర్ & హెడ్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ విభాగాధిపతి అయిన ప్రొఫెసర్ (డా.) దేశు రామ మోహన్ ఆధ్వర్యంలో ఈ …

Read More »

భవిష్యత్ సాంకేతిక రంగాల్లో యువతకు భారీ అవకాశాలు

-డీప్ టెక్ స్కిల్లింగ్‌తో అందుబాటులోకి ప్రపంచ స్థాయి టెక్నాలజీ -టెక్నాలజీ డే సందర్భంగా ఏపీలో భారీ డీప్‌టెక్ స్కిల్లింగ్ మిషన్ -NPTEL పరీక్షల్లో సత్తా చాటిన ఏపీ విద్యార్థులకు అభినందనలు -నేషనల్ టెక్నాలజీ డే సందర్భంగా ఎక్స్ వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్న సీఎం చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా భారత భవిష్యత్తును సాంకేతికత, ఆవిష్కరణల ద్వారా నిర్మిస్తున్న శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు, యువతకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇవాళ భారత శాస్త్రీయ విజయాలను స్మరించుకునే రోజు. …

Read More »

‘ఫ్లోరెన్స్‌ నైటింగేల్’ అవార్డులకు ఐదుగురి ఎంపిక‌

-గుంటూరులో ప్ర‌దానం చేయ‌నున్న వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్‌ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 2025 సంవ‌త్స‌రానికి గాను న‌ర్సింగ్ రంగంలో ఉత్త‌మ సేవ‌లందిస్తున్న ఐదుగురికి ‘ఫ్లోరెన్స్ నైటింగేల్’ అవార్డుల్ని ప్ర‌దానం చేయ‌నున్న‌ట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్ర‌క‌టించింది. ‘ఇంట‌ర్నేష‌న‌ల్ న‌ర్సెస్ డే’ సంద‌ర్భంగా ఈ ఐదుగురికి గుంటూరులో మంగ‌ళ‌వారంనాడు వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ ప్ర‌దానం చేయ‌నున్నారు. ప‌రిశోధ‌న‌, బోధ‌న‌, రోగుల సేవ‌, ఇత‌ర కేట‌గిరీల‌ ప‌నితీరులో వీరు ఉత్త‌మ ప‌నితీరు క‌న‌బ‌రిచార‌ని అధికారులు తెలిపారు. అవార్డు గ్ర‌హీత‌లు …

Read More »