Breaking News

Tag Archives: amaravathi

మహిళా భాగస్వామ్యంతోనే సమ్మిళిత వృద్ధి

-ఏడీసీ కార్యాలయంలో పోష్ చట్టం పై కార్యశాల అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏదైనా ప్రదేశంలో పనిచేస్తున్న మహిళలు భద్రతా భావాన్ని కలిగి ఉండి వారి భాగస్వామ్యాన్ని మెరుగుపరిస్తే అక్కడ ఆర్థిక సాధికారత మరియు సమ్మిళిత వృద్ధి జరుగుతుందని వాసవ్య మహిళా మండలి అధ్యక్షురాలు డాక్టర్ బి. కీర్తి ఉద్ఘాటించారు. భారతదేశంలో పని ప్రదేశాలలో POSH చట్టం (లైంగిక వేధింపుల నిరోధక చట్టం) మహిళలపై లైంగిక వేధింపులు & నియమాలపై అమరావతి అభివృద్ధి సంస్థ(ఏడీసీ) ఉద్యోగులకు, సిబ్బందికి గురువారం ఒకరోజు కార్యశాల నిర్వహించారు. …

Read More »

అమరావతిలో ఏర్పాటు కానున్న “కాస్మోస్ ప్లానిటోరియం”..APCRDA, IIA మధ్య కుదిరిన లీజు అగ్రిమెంట్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతిలో త్వరలో ఖగోళ శాస్త్ర కేంద్రం ఏర్పాటు కానుంది. ఈ మేరకు బెంగళూరు కోరమంగళలోని భారత ఖగోళ శాస్త్ర సంస్థ(Indian Institute of Astrophysics), భారత ప్రభుత్వ విజ్ఞాన, సాంకేతిక శాఖ (Department of Science & Technology) సహకారంతో రాజధాని అమరావతిలో “కాస్మోస్ ప్లానిటోరియం” ఏర్పాటు కానుంది. ఈ మేరకు APCRDA ఎస్టేట్స్ విభాగ జాయింట్ డైరెక్టర్ జుబిన్ రాయ్, IIA ప్రతినిధుల మధ్య గురువారం అమరావతిలోని రిజిస్ట్రార్ కార్యాలయంలో భూమి లీజు అగ్రిమెంట్ …

Read More »

తిరుపతి ఎస్.ఐ.హెచ్.ఎం సిబ్బంది వేతన కష్టాలకు తెర.. పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ చొరవతో రూ.84 లక్షల బకాయిలు విడుదల

-గత ప్రభుత్వ వైఖరితో 22 నెలలుగా నిలిచిన జీతాల సమస్య పరిష్కారంపై హర్షాతిరేకాలు -సచివాలయంలో మంత్రి కందుల దుర్గేష్ ని కలిసి కృతజ్ఞతలు తెలిపిన టీచింగ్ మరియు నాన్-టీచింగ్ సిబ్బంది -కూటమి ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన సిబ్బంది అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతిలోని స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ (ఎస్ఐహెచ్ఎం) సిబ్బంది సుదీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న వేతన సమస్యకు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్ …

Read More »

`సదరం’ సర్టిఫికేట్ల కోసం దరఖాస్తుల వెల్లువ

-నూతన సాఫ్ట్వేర్ వినియోగంతో సమస్యలకు చెక్ -57,452 మంది దరఖాస్తు -కొనసాగుతున్న స్లాట్ బుకింగ్ -30వ తేదీ నుంచి 110 అనుపత్రుల్లో వైద్య శిబిరాలు డిజిటల్ విధానంలో ధ్రువపత్రాల జారీ -డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ చక్రధరబాబు వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వైకల్య నిర్ధారణ పరీక్షల కోసం 57,452 మంది ‘సదరం సర్టిపికేట్ల కోసం దరఖాస్తు చేశారు. మొత్తం 110 ఆసుపత్రుల్లో మార్చి 30 నుంచి మే నెలాఖరు వరకు 80,653 మందికి పరీక్షలు చేసేందుకు స్లాట్ బుకింగ్ కోసం …

Read More »

తాప్సీ ఉపాధ్యాయకి మంత్రి సత్యకుమార్ అభినందనలు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈరోజు సచివాలయంలో దేశవ్యాప్తంగా ఆరోగ్య చైతన్యం కోసం కృషి చేస్తున్న యువతీ తాప్సీ ఉపాధ్యాయను సత్కరించి, అభినందించారు. మీరట్ (ఉత్తరప్రదేశ్) నుంచి “మిషన్ హెలీది భారత్ – ఒబేసిటీ ముక్త్ భారత్” బైక్‌పై యాత్ర మార్చి 9, 2025న ప్రారంభించారు. ఇప్పటివరకు సుమారు 17,400 కిలోమీటర్ల ప్రయాణం పూర్తి చేశారు. ఇప్పటివరకు 500 విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు, అలాగే లక్ష్యంగా పెట్టుకున్న 28 రాష్ట్రాలలో 16 …

Read More »

పర్యాటకులు పెరిగేలా ప్రణాళికలు

-బారువ నుంచి నెల్లూరు వరకూ బీచ్‌ల అభివృద్ధి -పర్యాటకుల కోసం హోటళ్లు, హోంస్టేలు పెంచేలా కార్యాచరణ -కారావాన్ పార్కులు… టెంట్ సిటీల ఏర్పాటుకు చర్యలు -పర్యాటక ప్రోత్సాహకానికి సీఎస్ అధ్యక్షతన కమిటీ -పర్యాటక శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో పెరుగుతోన్న పర్యాటకుల ఫుట్ ఫాల్‌కు అనుగుణంగా ఏపీలో హోటల్ గదులు, హోం స్టేలను త్వరితగతిన అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యాటక శాఖకు దిశానిర్దేశం చేశారు. 2029 నాటికి రాష్ట్రంలో 50 వేల హోటల్ …

Read More »

ఇండియన్ కలినరీ ఇనిస్టిట్యూట్ తో పర్యాటకశాఖ ఎంఓయూ

-ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో కుదిరిన చారిత్రాత్మక ఒప్పందం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ను కలినరీ టూరిజం హబ్ గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఏపీ పర్యాటక శాఖ తిరుపతిలోని ఇండియన్ కలినరీ ఇనిస్టిట్యూట్ తో అవగాహనా ఒప్పందం చేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఈ కీలకమైన ఎంఓయూ కుదిరింది. ఇండియన్ కలినరీ ఇనిస్టిట్యూట్ ప్రతినిధులు- ఏపీ పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ లు సీఎం సమక్షంలో ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. తెలుగు రుచులను, వంటకాలను ప్రపంచానికి పరిచయం …

Read More »

నవమికి ముందే రాములోరికి గిరి ప్రదక్షిణ సుమమాల

-రామతీర్థంలో నాటి వేదన బాధ.. నేడు అభివృద్ధి జాడతో తీరింది -రూ.3.40 కోట్ల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మాణం -ఆలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది -రూ.40 కోట్లతో 22 ప్రధాన ఆలయాలకు రోడ్డు వసతి కల్పించాం – శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణ మార్గాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాం -⁠కోటప్పకొండ గిరిప్రదక్షిణ మార్గంలో రోడ్డు మంజూరు చేశాం -ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం గిరిప్రదక్షిణ మార్గాన్ని వర్చువల్ గా ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆలయాల అభివృద్ధికి, హిందూ …

Read More »

దివ్యాంగుల జీవితాల్లో వెలుగులో నింపేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ఇంద్రధనస్సు తీసుకొచ్చారు

-ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగ శక్తి అమలు చేశాం -త్వరలో దివ్యాంగులకు రుణ రాయితీ పథకం అమలు చేస్తాం -అమరావతితో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో దివ్యాంగ భవన్లు నిర్మిస్తాం -మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి -వెలగపూడి సచివాలయంలో మంత్రి డిఎస్ బీవీ స్వామి అధ్యక్షతన డిజాబులిటీ అడ్వైజరీ స్టేట్ బోర్డ్ సమావేశం -ఉచిత బస్సు ప్రయాణం కల్పించినందుకు సీఎం చంద్రబాబు, మంత్రి స్వామికి సమావేశంలో కృతజ్ఞతలు తెలిపిన దివ్యాంగులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దివ్యాంగుల జీవితాల్లో వెలుగులో నింపేందుకు …

Read More »

వాట్సప్ మన మిత్ర ద్వారా ఉచితంగా సీనియర్ సిటిజన్ కార్డులు

-సైబర్ నేరాల పట్ల వృద్ధులకు విస్తృతంగా అవగాహన కల్పించాలి -రాష్ట్రంలో వృద్ధాప్య శాతాన్ని అధిగమించేందుకే సీఎం చంద్రబాబు నాయుడు పాపులేషన్ మేనేజ్ మెంట్ పాలసీకి శ్రీకారం చుడుతున్నారు -ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ, సీట్ల కేటాయింపు పటిష్టంగా అమలు చేయాలి -వృద్ధుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది -మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మన మిత్ర వాట్సాప్ ద్వారా రాష్ట్రంలోని వయో వృద్ధులకు ఉచితంగా సీనియర్ సిటిజన్ కార్డులు అందిస్తున్నామని వయోవృద్ధులు, దివ్యాంగుల సంక్షేమ …

Read More »