Breaking News

Tag Archives: amaravathi

ఇబ్బందులకు తెర.. ఎల్ఏ సాగరం వద్ద రోడ్డు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్

-తిరుపతి ఎంపీ గురుమూర్తి విజ్ఞప్తికి కేంద్ర మంత్రి స్పందన అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ రహదారి-71 ఆరు లేన్ల విస్తరణ పనుల కారణంగా నాయుడుపేట సమీపంలోని మందబయలు, కారుమంచివారి ఖండ్రిగ, కానూరు, తాళ్వాయపాడు హరిజనవాడ గ్రామాలతో పాటు అవని అపార్ట్‌మెంట్‌కు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని సంబంధిత గ్రామాల ప్రజలు, అవని అపార్ట్‌మెంట్ నివాసితులు ఈ ఫిబ్రవరిలో తిరుపతి ఎంపీ గురుమూర్తిని కలిసి సమస్యను వివరించారు. నాయుడుపేట సమీపంలోని ఎల్ఏ సాగరం వద్ద బాక్స్ బ్రిడ్జ్ నిర్మించినప్పటికీ సర్వీస్ రోడ్డు …

Read More »

ఉండవల్లిలో రహదారులను పరిశీలించిన అడిషనల్ కమిషనర్ కొల్లాబత్తుల కార్తీక్ ఐఏఎస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : APCRDA అడిషనల్ కమిషనర్ కొల్లాబత్తుల కార్తీక్ ఐఏఎస్ శనివారం ఉదయం రాజధాని అమరావతి- ఉండవల్లిలో పర్యటించారు. గ్రామంలోని మూల మలుపుల వద్ద రహదారి విస్తరించేందుకు ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో..APCRDA సమాయత్తమైంది. ఈ ప్రణాళికల అమలుకై గ్రామంలో రహదారికి సమీపంగా ఉన్న పలు స్థలాలు, నివాస గృహాలను కార్తీక్, CRDA స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఏ.జి. చిన్నికృష్ణ తో కలసి పరిశీలించారు. గ్రామంలో పర్యటిస్తున్న అడిషనల్ కమిషనర్ వద్దకు పలువురు గ్రామస్తులు, రైతులు వచ్చి వారి సమస్యలను …

Read More »

సి‌ఆర్డిఏ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకున్న యువత

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (APCRDA) ఆధ్వర్యంలో తుళ్లూరులోని స్కిల్ హబ్ కార్యాలయంలో శనివారం జాబ్ మేళా జరిగింది. జాబ్ మేళాలో స్కిల్ దునియా, APNRT, PVP స్టాఫింగ్, ముత్తూట్ ఫైనాన్స్, టెక్నో టాస్క్ కంపెనీలు పాల్గొన్నాయి. ఈ 5 కంపెనీలలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. జాబ్ మేళాకు 44 మంది అభ్యర్థులు హాజరు కాగా.. 33 మందికి ఉద్యోగాలు లభించాయి. వీరిలో APNRT సంస్థకు 22, PVP స్టాఫింగ్ …

Read More »

రాజధాని అమరావతి నగర పరిధిలో ఆక్రమణల తొలగింపుకై స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన APCRDA

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతి నగర అభివృద్ధి ప్రణాళికలకు అనుగుణంగా, అమరావతి జోనింగ్ నిబంధనల అమలులో భాగంగా APCRDA అధికారులు శనివారం ఆక్రమణల తొలగింపుకై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రాజధాని పరిధిలోని కృష్ణాయపాలెం, వెంకటపాలెం గ్రామాల్లో నిర్వహించారు. డ్రైవ్‌లో భాగంగా రహదారులు, ఫుట్‌పాత్‌లు, ప్రభుత్వ భూములపై ఉన్న అనధికార ఆక్రమణలను గుర్తించి తొలగించారు. ప్రజల రాకపోకలకు, వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్న కంటైనర్లు, తాత్కాలిక షెడ్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు తదితర నిర్మాణాలను APCRDA సిబ్బంది, సంబంధిత శాఖల …

Read More »

ప‌ర్యావ‌ర‌ణ మ‌నుగ‌డ అంద‌రి బాధ్య‌త‌

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌తోనే మాన‌వాళి మ‌నుగ‌డ ముడిప‌డి ఉంద‌ని ప్ర‌తి ఒక్క‌రూ ప‌ర్యావ‌ర‌ణాన్ని ప్రాణంతో స‌మానంగా కాపాడుకోవాల‌ని అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ లేబ‌ర్ బి.అనితా వాణి అన్నారు. ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని వెంక‌ట‌పాలెంలోని చిగురు ఆశ్ర‌మంలో ఎల్ అండ్ టీ కంపెనీ ఆధ్వ‌ర్యంలో ఏపీ సీఆర్డీఏ – ఏడీసీ ఈఎస్ఎంయూ విభాగం ఆధ్వ‌ర్యంలో అనాధ బాల‌ల‌తో మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మాన్ని శ‌నివారం జ‌రిపారు. ఈ సంద‌ర్భంగా ఆశ్ర‌మంలోని బాల‌ల‌కు పండ్లు, పండ్ల ర‌సాలు ఎల్ అండ్ టీ ప్ర‌తినిధులు …

Read More »

2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియకు శ్రీకారం

-మహిళలు, చిన్నారులతో కలసి స్వయంగా విత్తన బంతులు తయారు చేసిన పవన్ కళ్యాణ్ -డ్రోన్ల ద్వారా సీడ్ బాల్స్ వెదజల్లే ప్రక్రియను వీక్షించిన ఉప ముఖ్యమంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ జిల్లా, మూలపాడులో శుక్రవారం ఉదయం బటర్ ఫ్లై పార్క్ లో నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, …

Read More »

పర్యావరణం- ఆరోగ్య హితం కోసం సైకిల్

-తిరుగు ప్రయాణంలోనూ సైకిల్ పై సీఎం చంద్రబాబు విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు తన తిరుగు ప్రయాణంలోనూ సైకిల్ పై హెలిపాడ్ వరకూ ప్రయాణించారు. నోవోటెల్ హోటల్ నుంచి బీచ్ రోడ్డు మీదుగా వైఎంసీఏ, వుడాపార్కు సర్కిల్ , పోలమాంబ గుడి మీదుగా ఏయూలోని ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ దగ్గర ఏర్పాటు చేసిన హెలిపాడ్ కు సైకిల్ పై ప్రయాణించారు. 5.5 కిలోమీటర్ల దూరాన్ని 17 నిమిషాల్లో సీఎం చేరుకున్నారు. దారిలో ప్రజలకు అభివాదం …

Read More »

దిగ్విజయంగా ముగిసిన పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ కేరళం పర్యటన

-ఏపీని బెస్ట్ టూరిజం ప్రమోషన్ స్టేట్ గా ఎంపిక చేసి అవార్డు అందించినందుకు నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్ అమరావతి/ తిరువనంతపురం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ మూడు రోజుల కేరళం పర్యటన దిగ్విజయంగా ముగిసింది. ఈ సందర్భంగా పర్యాటక రంగ అభివృద్ధి, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ, అద్భుతమైన గమ్యస్థాన బ్రాండింగ్‌లో చూపిన ప్రతిభకు గాను ఆంధ్రప్రదేశ్‌కు ప్రతిష్టాత్మక ‘బెస్ట్ టూరిజం ప్రమోషన్ స్టేట్’ అవార్డును తిరువనంతపురంలో అందించినందుకు గ్లోబల్ ట్రావెల్ మార్కెట్-2026 నిర్వాహకులకు, …

Read More »

ఆర్టీజిఎస్ ‘అవేర్’ యాప్‌తో విపత్తుల నుండి రక్షణ: వెంటనే డౌన్‌లోడ్ చేసుకోండి…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వాతావరణ మార్పులు, ఊహించని విపత్తుల నుండి ప్రజలను ముందస్తుగా అప్రమత్తం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యాధునిక విపత్తు హెచ్చరిక వ్యవస్థ RTGS అవేర్’ (AWARE) మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. తుపాన్లు, వరదలు, ఎండ తీవ్రతతో పాటు ప్రాణాంతకమైన పిడుగుపాట్లపై ఈ యాప్ నిరంతరం రియల్ టైమ్ అప్‌డేట్స్ అందిస్తుంది. ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించడంలో కీలక పాత్ర పోషించే ఈ ‘అవేర్’ యాప్ ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లలో అందుబాటులో ఉంది. …

Read More »

డిఎస్సీ-2025 నియామకాలు పూర్తిస్థాయి పారదర్శకతతోనే జరిగాయి

-సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, జి.ఓ.ఎం.ఎస్. నెం.77 ప్రకారమే హారిజాంటల్ రిజర్వేషన్ల అమలు -ఎస్.ఎస్.రావత్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (సర్వీసెస్) అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : డిఎస్సీ-2025 నియామకాల్లో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, జి.ఓ.ఎం.ఎస్. నెం.77 ప్రకారమే హారిజాంటల్ రిజర్వేషన్లను అమలు చేస్తూ, పూర్తిస్థాయి పారదర్శకతతో నియామక ప్రక్రియ నిర్వహించడం జరిగిందని సర్వీసెస్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్. రావత్ తెలిపారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో రాష్ట్ర విద్యా శాఖ సెక్రటరీ కోన శశిధర్, శాప్ వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ భరణితో …

Read More »