-డిసెంబర్ 17 న ఆరు నీటి సంఘాల డిస్ర్టిబ్యూటరీ కమిటీ ఎన్నికలు
-కలక్టర్ పి ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లా పరిధిలో శనివారం నిర్వహించిన నీటి సంఘాల ఎన్నికలలో 113 సంఘాలు ఏకగ్రీవంగా అయినట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి శనివారం రాత్రి ఒక ప్రకటనలో తెలియచేసారు. తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని 113 ప్రాదేశిక నియోజకవర్గాలు పరిధిలోని అన్ని ఏకగ్రీవం కావడం జరిగినట్లు, డిసెంబర్ 17 మంగళవారం ఆరు నీటి సంఘాల డిస్ర్టిబ్యూటరీ కమిటీలకు ఎన్నికల నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తి చేసేందుకు క్షేత్ర స్థాయి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. నిడదవోలు మండలం లో పొలింగ్ ప్రక్రియ ను పరిశీలించిన ఆర్డీవో రాణి సుస్మిత, అనంతరం ఎన్నికైనట్లు ధ్రువపత్రము జారీ.
Prajavartha Online Telugu News