Breaking News

Andhra Pradesh

సైన్యాధ్యక్షుడికి మద్దతుగా… తరలి వచ్చిన వేల మంది సైన్యం…

-విద్యాసాగర్, డి.వి. రమణ -నామినేషన్ల మహోత్సవ సంబరం… -వెల్లువెత్తిన అభిమాన జనసంద్రం… -భారీ ఊరేగింపుతో…ఉద్యోగుల ఆనందోత్సాహాలు… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కార్య దక్షత కలిగిన నాయకుడు తమకు కావాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎలుగిత్తి చాటిన అరుదైన సందర్భం ఇది. ఏపీ ఎన్జీజీవో రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు, కార్యవర్గంలోని వివిధ పదవుల భర్తీ కోసం నేడు జరిగిన ఎన్నికలలో పోటీ చేసేందుకు ప్రస్తుత అధ్యక్ష, కార్యదర్శులు అలపర్తి విద్యాసాగర్, డివి రమణలు నామినేషన్ల కార్యక్రమం యావత్తు ఉద్యోగుల ఆనందోత్సాహాల మధ్య విజయవాడ …

Read More »

రేపు సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శుల సమావేశం

-జీఎస్డీపీ, స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాలు, పదిసూత్రాలపై చర్చ -ఆదాయార్జన శాఖలు, కేంద్ర ప్రాయోజిత పథకాలు, పీపీపీ ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష -సమావేశానికి వర్చువల్ గా హాజరుకానున్న కలెక్టర్లు, ఎస్పీలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సోమవారం మంత్రులు, కార్యదర్శుల సమావేశం జరుగనుంది. సచివాలయంలో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకూ ఈ సమీక్ష నిర్వహించనున్నారు. మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. అలాగే జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు వర్చువల్ …

Read More »

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే అంశంపై కేంద్ర సమాచార & ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (CBC) ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ ఈ రోజు ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అనం రామనారాయణ రెడ్డి, నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణ …

Read More »

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై భారత్ (MY Bharat) కార్యక్రమం భాగంగా లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల యన్.యస్.యస్. యూనిట్ ఆధ్వర్యంలో అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం (Inter-State Youth Exchange Program) (03-02-2026 నుండి 07-02-2026) ఐదు రోజుల పాటు కార్యక్రమంలో భాగంగా ఐదవ రోజు కార్యక్రమంలో కేరళ విద్యార్థులు వారి వంటకాలను తయారు చేసి ప్రదర్శించారు, ఈ కార్యక్రమంలో యస్.శ్రీనివాస రావు, స్టెప్(STEP) మేనేజర్ మాట్లాడుతూ …

Read More »

విజయవాడలో ఘనంగా ముగిసిన ‘ఆంధ్రనాట్య సంగమం’ – నవ జనార్ధన పారిజాత నృత్య ప్రదర్శన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని గవర్నర్‌పేటలో మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ‘స్వరనర్తన’ సంగీత నృత్య శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన “ఆంధ్రనాట్య సంగమం” కార్యక్రమం ఆదివారం రాత్రి కళాప్రియుల మధ్య అత్యంత వైభవంగా ముగిసింది. కీ.శే. పద్మశ్రీ డా. నటరాజ రామకృష్ణ ఆశీస్సులతో, కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత గురు డా. కళాకృష్ణ గారి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమం ఆంధ్రనాట్య వైభవాన్ని చాటింది. ఈ సందర్భంగా పద్మామోహన్ దెందులూరి ప్రత్యేక *“నవ జనార్ధన పారిజాత”* నృత్య …

Read More »

నేడే ఏపీ మెడికల్ కౌన్సిల్ ఎన్నికలు…

-ఈ నెల 10 వ తేదీన ఓట్ల లెక్కింపు… ఫలితాల ప్రకటన -రిటర్నింగ్ అధికారిగా డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ చక్రధర్ బాబు ను నియమించిన రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 56,374 మంది నమోదిత వైద్యులు ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ (APMC)–2026 ఎన్నికల్లో పాల్గొననున్నారు. ఈ ఎన్నికల ద్వారా మొత్తం 13 మంది సభ్యులను ఎన్నుకోనున్నారు. 84 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ​ఈ ఎన్నికల కోసం https://apmc.ap.gov.in. ద్వార ఫిబ్రవరి 9, 2026 న …

Read More »

దేవరపల్లి ఆశ్రమ బాలుర హాస్టల్ విద్యార్ధుల అస్వస్థతపై సిఎం సమీక్ష

-రేపటిలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించిన ముఖ్యమంత్రి చంద్రబాబు -నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలకు ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పోలవరం జిల్లా రంపచోడవరంలోని దేవరాపల్లి ఆశ్రమం బాలుర హాస్టల్ లో విద్యార్ధుల అస్వస్థత ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఎంఓ అధికారులు, ఇతర అధికారులతో సమీక్ష చేశారు. పోలవరం జిల్లా రంపచోడవరం లోని దేవరపల్లి ఆశ్రమ బాలుర హాస్టల్ లో 92 మంది విద్యార్ధులకు వాంతులు, కడుపునొప్పి, జ్వరం, డయేరియా లక్షణాలు కనిపించటంతో వారిని హుటాహుటిన మారేడుమిల్లి, రంపచోడవరం ఏరియా …

Read More »

శ్రీ దుర్గా నాగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు పోస్టర్లు, కరపత్రాల ఆవిష్కరన

మోపిదేవి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 15వ తేదీ జరిగే మహా శివరాత్రి వేడుకలు విజయవంతం చేయాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కోరారు. ఆదివారం మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో పెదకళ్లేపల్లి శ్రీ దుర్గా నాగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు, మహా శివరాత్రి వేడుకల వాల్ పోస్టర్లు, కరపత్రాలను ఎమ్మెల్యే ముఖ్య అతిధిగా విచ్చేసి ఆవిష్కరించారు. మహాశివరాత్రికి తరలివచ్చే వేలాది భక్తులకు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖల సహకారంతో ఉత్సవాలు విజయవంతం చేయాలని …

Read More »

రెండో రోజు మొబైల్ మెడికల్ క్యాంప్ కు అనూహ్య స్పందన..

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మొబైల్ మెడికల్ క్యాంప్ రెండో రోజు కొనసాగింది.. భావనీపురం 42 వ డివిజన్ హెచ్ బీ కాలనీ లో ఆదివారం కూడా క్యాంప్ నిర్వహించారు.. వందల సంఖ్యలో స్థానికులు వచ్చి వివిధ ఆరోగ్య సమస్యల పై వైద్యులను సంప్రదించి వైద్య సాయం అందుకున్నారు.. క్యాంప్ లో భాగంగా పీవీఆర్ హాస్పిటల్స్ సిబ్బంది రక్త పరీక్షలు, ఈసీజీ, 2డీ ఎకో,పరీక్షలు నిర్వహించారు.. రోగ నిర్ధారణ అయిన వారికి సుజనా ఫౌండేషన్ మందులను సైతం …

Read More »

అద్భుతంగా శ్రీ సత్యసాయి రన్ & రైడ్ – 2026 కార్యక్రమం

-విజయవాడలో ఐక్యతా స్ఫూర్తిని చాటిన శ్రీ సత్యసాయి రన్ & రైడ్ –2026 విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జన్మ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా, ఐక్యతా భావం వ్యాప్తి మరియు ఫిట్ ఇండియా ఉద్యమానికి మద్దతు లక్ష్యంగా, శ్రీ సత్యసాయి సేవ ఆర్గనైజేషన్స్ ఆధ్వర్యంలో ఆదివారం శ్రీ సత్యసాయి రన్ & రైడ్ – 2026 కార్యక్రమం విజయవాడలో అద్భుతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని విజయవాడ బీఆర్‌టీఎస్ రోడ్డులో, శారద జూనియర్ కళాశాల ఎదుట, ఎస్.కే. షెరిన్ …

Read More »