– ప్రజాస్వామ్య స్ఫూర్తితో ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణలో భాగస్వాములు కావాలి – ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల శిక్షణ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : క్రమశిక్షణ, నిష్పక్షపాతంతో ఎన్నికల విధులు నిర్వర్తించాలని.. ప్రజాస్వామ్య స్ఫూర్తితో ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు భాగస్వాములు కావాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.డిల్లీరావు అన్నారు. ఈ నెల 13న జరగనున్న సాధారణ ఎన్నికలకు సంబంధించిన విధుల్లో 1,250 మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గోనున్నారు. ఈ నేపథ్యంలో …
Read More »Daily Archives: May 4, 2024
స్వేఛ్చాయుత ఎన్నికల నిర్వహణే లక్ష్యం
-రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా -కమాండ్ కంట్రోల్ రూమ్ ను సందర్శించిన సి.ఈ.ఓ. అనకాపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రతి ఓటరూ వోటుహక్కు తప్పక వినియోగించుకునేలా అధికారులు కృషి చేయాలని రాష్ట్ర ప్రథాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. శనివారం ఆయన అనకాపల్లి కలెక్టరు కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ను సందర్శించారు. వివిధ విభాగాల ద్వరా ఎన్నికల ప్రక్రియకు అనుసరిస్తున్న విధానాలను గుర్చి జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టరు రవి …
Read More »ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు ఒక రోజు ప్రత్యేక సాధారణ సెలవు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఒకరోజు ప్రత్యేక సాధారణ సెలవును మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రధాని ఎన్నికల అధికారి మరియు ప్రభుత్వ ఈవో ప్రిన్సిపల్ సెక్రెటరీ ముఖేష్ కుమార్ మీనా శనివారం ప్రభుత్వ ఉత్తర్వులను జారీ చేశారు. భారత ఎన్నికల సంఘం సూచనల మేరకు జిఓఆర్టి నెంబర్ 845, తే.04.05.2024 ను జారీ చేయటం జరిగింది. ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాలలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయడానికి వీలుగా ఎన్నికల విధుల్లో …
Read More »ఎన్నికలు సజావు నిర్వహణకు పటిష్ట చర్యలు చేపట్టండి
-జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేసిన సీఈవో ముకేశ్ కుమార్ మీనా -ఏయూలోని స్ట్రాంగ్ రూమ్ వద్ద ఈవీఎంల కమిషనింగ్ ప్రక్రియ పరిశీలన -డిస్ట్రిబ్యూషన్ సెంటర్, ఫెసిలిటేషన్ కేంద్రాల వద్ద ఏర్పాట్ల పరిశీలన, సంతృప్తి విశాఖపట్టణం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు పటిష్ట చర్యలు చేపట్టాలని, సమష్టి కృషితో ముందుకు వెళ్లాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా జిల్లా అధికారులకు సూచించారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా సమన్వయం వహించాలని, సమర్ధంగా విధులను నిర్వర్తించాలని …
Read More »మా ప్రజాస్వామ్య వేడుక మీరూ వీక్షించండి
-ఇతర దేశాల ఎన్నికల నిర్వహణ సంస్థలకు భారత ఎన్నికల సంఘం ఆహ్వానం -23 దేశాలకు చెందిన ఎన్నికల నిర్వహణ సంస్థల నుండి వచ్చిన 75 మంది ప్రతినిథులు నిర్వచన్ సదన్, న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : భారత ఎన్నికల సంఘం ఎన్నికల సమగ్రత మరియు పారదర్శకతకు దీపస్తంభంగా సార్వత్రిక ఎన్నికలను నిర్వహించడంలో తన నిబద్ధతను చాటుకుంటూ.. అత్యున్నత ప్రమాణాలతో ప్రజాస్వామ్య ఔన్నత్యాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు ప్రపంచ ఎన్నికల నిర్వహణ సంస్థలకు (EMBలు) బంగారు వారధిని అందిస్తోంది. 2024 లోక్సభ ఎన్నికల సందర్భంగా ఎన్నికల …
Read More »అవినీతినేతలను ప్రజలు ప్రశ్నించాలి… : సుజనా చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైసీపీ పాలనలో భావవ్యక్తీకరణకు స్వేచ్ఛ లేదని పశ్చిమ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. న్యాయవాదుల ఉచిత న్యాయ సహాయ కేంద్రం అవగాహన సదస్సును సితార వద్ద గల కన్వెన్షన్ సెంటర్ లో శనివారం నిర్వహించారు. ప్రముఖ న్యాయవాది గోగుశెట్టి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సుజనా చౌదరి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ వైసిపి పాలనలో భావవ్యక్తీకరణకు స్వేచ్ఛ లేదని అన్యాయాన్ని ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతల మీద అక్రమ కేసులు …
Read More »మన భవిష్యత్తు మన చేతుల్లోనే… : సుజనా చౌదరి
-ఓటు శక్తివంతమైన ఆయుధం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అవినీతిపరులైన రాజకీయ నేతలను ఇంటికి పంపించాలని సుజనా చౌదరి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం సాయంత్రం భవానిపురం లోని 40 41 42 డివిజన్లలో పర్యటించారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సుజనా మాట్లాడుతూ జగన్ పాలనలో భావవ్యక్తీకరణకు స్వేచ్ఛ లేదని ప్రశ్నించే ప్రజల హక్కులను కాల రాస్తున్నాడు అన్నారు. ఐదేళ్ల వైసిపి పాలనలో కొండలను తవ్వడం చెట్లను నరకడం ప్రతిపక్ష నేతల నిర్మాణాలను …
Read More »జన సైనికులుగా మారిన చిరు సైనికులు..
-జన సేన కండువా కప్పుకున్న వైసిపి కి చెందిన చిరు అభిమానులు.. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన పలువురు చిరంజీవి అభిమానులు జనసేన లో చేరారు. భవానిపురంలోని పశ్చిమ నియోజకవర్గ కూటమి కార్యాలయం లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జనసేన పార్టీ సమన్వయ కర్త అమ్మిసెట్టీ వాసు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. చిరంజీవి యువత నాయకులు కృష్ణ ప్రసాద్, శ్యాం ప్రసాద్, జనసేన పార్టీ సమన్వయకర్త అమ్మి శెట్టి వాసు ఆధ్వర్యంలో చిరంజీవి అభిమానులు జనసేన …
Read More »చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పై ఈసీకి వైసీపీ బృందం ఫిర్యాదు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి గూర్చి బహిరంగ సభలలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు మాట్లాడుతున్న దిగజారుడు వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కోరారు. ఈమేరకు శనివారం వెలగపూడి సచివాలయం నందు అడిషనల్ సీఈవో హరీంద్ర ప్రసాద్ ను కలిసి ఫిర్యాదునందించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమలులో ఉన్నప్పటికీ చంద్రబాబుకు ఏమాత్రం పట్టడం లేదని మల్లాది విష్ణు విమర్శించారు. ఈసీ ఇప్పటికే అనేక సార్లు నోటీసులిచ్చినా.. బాబు …
Read More »భూకబ్జాదారులు, పార్టీ ఫిరాయింపుదారులకు ఓటుతో బుద్ది చెప్పండి
-మీట్ ది ప్రెస్లో ఇండియా కూటమి అభ్యర్థి సీహెచ్ బాబురావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భూకబ్జాదారులు, పార్టీ ఫిరాయింపుదారులకు ఓటు అనే ఆయుధం ద్వారా బుద్ది చెప్పాలని ఇండియా కూటమి సెంట్రల్ సీపీఎం అభ్యర్థి చిగురుపాటి బాబూరావు నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్, సీపీఐ, ఆమ్ఆద్మీ పార్టీలే కాకుండా ఆయా రంగాల్లో పని చేసే కార్మికులు, ఉద్యోగులు, ప్రజాసంఘాలన్నీ తనను బలపరుస్తున్నారని తెలిపారు. ప్రెస్క్లబ్లో శనివారం జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో బాబూరావు పాల్గొని మాట్లాడారు. వైసిపి, టిడిపి …
Read More »