Breaking News

Daily Archives: September 11, 2024

నటుడు సాయి ధరంతేజ్ 10 లక్షల విరాళం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రముఖ కధానాయకుడు సాయి ధరంతేజ్ వరద బాధితుల సహాయార్థం ఏపీ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు నటుడు ఇటీవల విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ మొత్తాన్ని నేడు చెక్కు రూపం లో మంత్రి నారా లోకేశ్‌ను కలిసి రూ. 10 లక్షల చెక్కు అందజేశారు.

Read More »

తెలంగాణ వరదల సహాయక చర్యల నిమిత్తం డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ కోటి విరాళం

హైదారాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ నివాసంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో భేటీ అయ్యారు. భారీ వర్షాలు, వరదల సహాయక చర్యల నిమిత్తం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి విరాళం చెక్కును అందచేశారు. అనంతరం వారి భేటీపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ప్రకృతి విపత్తు వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు …

Read More »

ఏలేరు వ‌ర‌ద బాధితుల‌కు అండ‌గా ఉండండి… : పవన్‌ కల్యాణ్‌

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్డీఆర్ఎఫ్‌, ఎస్‌డీఆర్ఎఫ్‌ తో పాటు ఆర్మీ బృందాల సేవలను కూడా వినియోగించుకొని ఏలేరు వ‌ర‌ద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. నివాస సముదాయాలను వరద చుట్టుముట్టిన చోట్ల అక్కడి ప్రజలకు తగిన ఆహారం, నీరు, పాలు అందించాలని కోరారు. ఏలేరు వరదతో పంటలు కోల్పోయిన రైతులతో ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం మాట్లాడుతూ ధైర్యం చెప్పాలని సూచించారు. ఏలేరు వరద ఉధృతిపై కాకినాడ జిల్లా కలెక్టర్ తో ఇవాళ ఉదయం …

Read More »

వరద బాధితులకు డాక్టర్ తరుణ్ కాకాని ఆపన్న హస్తం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వరద ప్రభావిత ప్రాంత ప్రజలకు ఆపన్న హస్తం అందించేందుకు సేవా కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ముందుండే డాక్టర్ తరుణ్ కాకాని ఇటీవల సంభవించిన వరదల్లో నష్టపోయిన బాధితులకు అండగా నిలిచారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి ఎబిసి అమరావతి బోటింగ్ క్లబ్ తరపున సిఈఒ, బిజెపి నాయకులు, సామాజికవేత్త డాక్టర్ తరుణ్ కాకాని, ఎండి కె.పవిత్ర దంపతులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 1,00,116 విరాళానికి సంబంధించిన చెక్కును అందజేశారు. …

Read More »

ఏపీ పోలీసు శాఖకు కేంద్ర పురస్కారం

-ఆన్‌లైన్‌లో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాల నియంత్రణలో అత్యుత్తమ పనీతీరు -అమిత్ షా చేతుల మీదుగా పురస్కారం ప్రదానం -‘సర్టిఫికెట్ ఆఫ్ రికగ్నిషన్’ అందజేత ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ పోలీస్ విభాగానికి కేంద్ర పురస్కారం లభించింది. ఆన్‌లైన్‌లో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాల నియంత్రణలో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు ఏపీ పోలీసు విభాగానికి కేంద్ర ప్రభుత్వం పురస్కారాన్ని ప్రకటించింది. ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్రహోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా ఏపీ సీఐడీ విభాగాధిపతి రవిశంకర్ అయ్యన్నార్, …

Read More »

మీ కస్టాలు చూసాను.. ప్రతీ ఒక్కరికీ న్యాయం చేసే బాధ్యత తీసుకుంటాను…

-పంట నష్టం ఎకరాకు రూ. 10వేలు అందిస్తాం… వరదల వల్ల నష్టపోయిన రైతాంగానికి అండగా ఉంటాం… -పారదర్శకతతో, జవాబుదారీతనంతో ప్రతీ నష్టాన్ని సర్వే చేయిస్తాం.. -ఇళ్ళు ,ఉద్యానవన పంటలు,పశువులు నష్టాలపై ఈనెల 17వ తేదీ లోగా సర్వే చేసి పరిహారం అందిస్తాం-ముఖ్యమంత్రి -నారా చంద్రబాబునాయుడు -కొల్లేరు ప్రాంతంలో వరద నష్టాన్ని హెలికాప్టర్ ద్వారా పరిశీలించిన ముఖ్యమంత్రి ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : వరదలలో నష్టపోయిన ప్రతీ ఒక్కరికీ న్యాయం చేసే బాధ్యతను తీసుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఏలూరు …

Read More »

అటవీ సంపదను కాపాడటంలో సిబ్బంది త్యాగాలు స్మరణీయం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 37,421 చ.కి.మీ. సుసంపన్నమైన అటవీ సంపద ఉంది. శ్రీగంధం, ఎర్ర చందనం లాంటివి విలువైన వృక్ష జాతులు… అద్భుతమయిన వన్య ప్రాణులు మన అడవుల్లో ఉన్నాయి. అమూల్యమైన ఈ సహజ సంపదను అవిశ్రాంతంగా పరిరక్షించడంలో అంకిత భావంతో కూడిన మన రాష్ట్ర అటవీ సిబ్బంది ముందంజలో ఉన్నారు. ఈ వనరులను కాపాడుకునే క్రమంలో, మా ధైర్యవంతులైన సిబ్బందిలో కొందరు ప్రాణ త్యాగం చేశారు. ఖేజ్రీ చెట్లను రక్షించడానికి బిష్ణోయ్ తెగవారు చేసిన చారిత్రాత్మక త్యాగాన్ని …

Read More »

స్వచ్ఛంద సేవా సంస్థల సేవలు భేష్

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వరద బాధితులను ఆదుకోవడానికి ముందుకొస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థల సేవలను రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత కొనియాడారు. బుధవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో విజయవాడ రౌండ్ టేబుల్, అమరావతి రౌండ్ టేబుల్ స్వచ్ఛంద సేవా సంస్థలు వరద బాధితులకు అందజేసే బట్టల కిట్ ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, వరద బాధితులను ఆదుకోవడంలో స్వచ్ఛంద …

Read More »

ఏడు నెలలుగా ఆగిపోయిన జీతం విడుదల

-ఉప ముఖ్యమంత్రి దృష్టికి రాగానే సమస్య తక్షణ పరిష్కారం -రూ.30 కోట్లు వేతన బకాయిలు విడుదల -శ్రీ సత్యసాయి వాటర్ సప్లై స్కీంలో 536 మంది కార్మికుల సమస్యకు పరిష్కారం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి అనంతపురం జిల్లాలో శ్రీ సత్యసాయి వాటర్ సప్లై ప్రాజెక్టు బోర్డు ద్వారా గ్రామీణ ప్రాంతాలకు తాగునీరు అందించే పథకం సాగుతోంది. ఇందులో పని చేసే 536 మంది కార్మికులకు 7 నెలలుగా జీతాలు అందటం లేదు. 536 మంది కార్మికుల సమస్య రాష్ట్ర ఉప …

Read More »

ఈ నెల 12న జిల్లాలో కేంద్ర బృందం ప‌ర్య‌ట‌న‌

– వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో న‌ష్టాల ప‌రిశీల‌న‌ – ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో న‌ష్ట అంచ‌నాకు కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్ర‌ట‌రీ అనిల్ సుబ్రహ్మ‌ణ్యం నేతృత్వంలో కేంద్ర బృందం గురువారం ఎన్‌టీఆర్ జిల్లాలో ప‌ర్య‌టించ‌డం జ‌రుగుతుంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న తెలిపారు. క‌లెక్ట‌ర్ సృజ‌న బుధ‌వారం క‌లెక్ట‌రేట్‌లో కేంద్ర బృందం ప‌ర్య‌ట‌న‌కు చేయాల్సిన ఏర్పాట్ల‌పై ఇరిగేష‌న్‌, మునిసిప‌ల్‌, ఆర్ అండ్ బీ, గ్రామీణ నీటిస‌ర‌ఫ‌రా, వ్య‌వ‌సాయం, ఉద్యాన‌, విద్యుత్ …

Read More »