-పీహెచ్సీలపై ప్రత్యేక దృష్టి సారిస్తాం -రానున్న ఐదేళ్ళల్లో ప్రతి ఇంటికి తాగునీరు -ఐటీడీఏలకు పూర్వ వైభవం తెస్తాం -ఉద్యానవన పంటలతో పరిశ్రమల స్థాపనకు కృషి -సంక్రాంతి నాటికి గుంతలు లేని రహదారులు -ప్రజా ప్రతినిధులు, అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి -సమిష్టి కృషితో జిల్లా అభివృద్ధి సాధ్యం -డీఆర్సీ సమావేశంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి మరియు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పార్వతీపురం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రజాప్రతినిధులు, జిల్లాయంత్రాంగం, అధికారుల సమిష్టి కృషి, సహకారంతో జిల్లా అభివృద్ధి సాధ్యమౌతుందని …
Read More »Daily Archives: December 9, 2024
నిబంధనలు పాటించని 18 ఇసుక బోట్స్ సీజ్
-ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగింది -క్రిమినల్ కేసులు నమోదు కు చర్యలు -జేసి చిన్న రాముడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం ధోబి ఘాట్ వద్ద 8 బొట్స్, కొవ్వూరు వైపు ఏలినమ్మ ఘాట్ వద్ద 10 బొట్స్ ద్వారా అక్రమంగా ఇసుక ను తరలిస్తున్న బోట్స్ ను సోమవారం ఉదయం ఆకస్మిక తనిఖీలు నిర్వహించి మొత్తం 18 బోట్స్ ను సీజ్ చేయడం జరిగింది. . జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు రైలు కం రోడ్డు, గ్రామన్ బ్రిడ్జి …
Read More »మైనార్టీల సంక్షేమం, అభివృద్ది ధ్యేయంగా పనిచేస్తా
-నా జీవితం మైనార్టీ కుటుంబాలకు అంకితం -మీ ఆదరాభిమానాలే నన్నుఈ స్థాయికి చేర్చాయి -అర్హులైన మైనార్టీలకు పథకాలు అందిస్తా -మౌలానా షేక్ ముస్తాక్ అహ్మద్, చైర్మన్,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నేను ఈ స్థాయికి రావడానికి కారణం మీ అందరి ఆదరాభిమానాలే కారణమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా షేక్ ముస్తాక్ అహ్మద్ తెలిపారు. తుమ్మలపల్లి కళా క్షేత్రం లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా మౌలానా …
Read More »ప్రతి ఇల్లూ సూర్య ఘర్ కావాలి
– పీఎం సూర్య ఘర్ కార్యక్రమం ప్రయోజనాలను ప్రజలకు వివరించాలి – స్పెషల్ డ్రైవ్తో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వేగవంతం చేయాలి – లబ్ధి పొందేందుకు ఆన్లైన్లో తేలిగ్గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు – విద్యుత్ శాఖ అధికారులతో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన (సౌర విద్యుత్) పథకం అమలుతో జిల్లాలోని ప్రతి ఇల్లూ సూర్య ఘర్ కావాలని.. ఆర్థిక చేయూతతో పాటు పర్యావరణ పరిరక్షణకు కీలకమైన ఈ పథకం ప్రయోజనాలను ప్రజలకు …
Read More »జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖలో ఖాళీల భర్తీ
-సెంటర్ అడ్మినిస్ట్రేటర్, సైకో-సోషల్ కౌన్సెలర్ పోస్టుల భర్తీ -ఐసీడీఎస్ పీడీ జి. ఉమాదేవి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యములో నడపబడుచున్న వన్ స్టాప్ సెంటర్ నందు ఖాళీగా ఉన్న ఒక సెంటర్ అడ్మినిస్ట్రేటర్ పోస్టును, సైకో-సోషల్ కౌన్సెలర్ పోస్టులను భర్తీ చేసేందుకు అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా మహిళ శిశు సంక్షేమ అధికారిణి ఉమాదేవి ఒక ప్రకటనలో తెలిపారు. పై పోస్టులను భర్తీ చేసేందుకు గతంలో నోటిఫికేషన్ ఇచ్చి …
Read More »పటిష్ట సమన్వయం, పర్యవేక్షణతో అర్జీలను పరిష్కరించండి
– ప్రజాసమస్యల పరిష్కార వ్యవస్థకు 120 అర్జీలు – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) ద్వారా అందిన అర్జీలను పటిష్ట సమన్వయం, పర్యవేక్షణతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ.. జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా, డీఆర్వో ఎం.లక్ష్మీ నరసింహం, గ్రామ, వార్డు …
Read More »నవ ఆవిష్కరణలకు వేదిక.. పాలీటెక్ ఫెస్ట్
– కొత్త ఆలోచనలకు ప్రతిరూపంగా ప్రాజెక్టులు – రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ జేడీ వి.పద్మారావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నవ ఆవిష్కరణలకు పాలీటెక్ ఫెస్ట్ ఓ గొప్ప వేదిక అని.. యువ మెదళ్ల నుంచి వచ్చిన కొత్త ఆలోచనలకు ప్రతిరూపంగా విద్యార్థుల ప్రాజెక్టులు ఉన్నాయని రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ జేడీ వి.పద్మారావు అన్నారు. సోమవారం విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో రీజనల్ పాలీటెక్ ఫెస్ట్-2024ను రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ జేడీ వి.పద్మారావు.. ఎస్బీటీఈటీ కార్యదర్శి జీవీ రామచంద్రరావు, స్థానిక …
Read More »పర్యాటక ప్రదేశాలు తెలిపే సూచిక బోర్దుల గోడ పత్రిక ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాల దూరాలను తెలిపే సూచిక బోర్దుల గోడ పత్రికను సోమవారం నగరంలో కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆవిష్కరించారు. జిల్లాలోని ముఖ్య పర్యాటక ప్రదేశాలు మంగినపూడి బీచ్, హంసలదీవి, మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం, కూచిపూడి నృత్య కళాశాల, పెడన కలంకారి తదితర ప్రదేశాల దూరాలను తెలిపే విధంగా సూచిక బోర్డులను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ బోర్డులు జిల్లా సరిహద్దు ప్రాంతం కామయ్యతోపు నుంచి …
Read More »నగరంలో బుధ, గురువారాల్లో త్రాగునీటి సరఫరాలో అంతరాయం… : కమిషనర్ పులి శ్రీనివాసులు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ హెడ్ వాటర్ వర్క్స్ కు ఉండవల్లి నుండి త్రాగునీటి సరఫరా జరిగే 1600 ఎంఎం డయా పైప్ లైన్ పై తక్కెళ్లపాడు గ్రామంలో ఏర్పడిన లీకు వలన అధిక మొత్తంలో నీరు వృధా అవుతున్నందున లీకు మరమత్తు పనులను బుధవారం ఉదయం సరఫరా అనంతరం చేపట్టడానికి ఇంజినీరింగ్ అధికారులు యాక్షన్ ప్లాన్ సిద్దం చేశారని, పనుల వలన బుధవారం సాయంత్రం నుండి గురువారం సాయంత్రం వరకు (11,12 తేదీలు) నగరంలోని పలు ప్రాంతాల్లో …
Read More »డయల్ యువర్ కమిషనర్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో స్థానిక సమస్యల పరిష్కారం కోసం నగరపాలక సంస్థలో చేపట్టే డయల్ యువర్ కమిషనర్, పిజిఆర్ఎస్ లో ప్రజలు ఇస్తున్న ఆర్జీలను సమగ్రంగా పరిశీలించి, శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. సోమవారం నగరపాలక సంస్థ కమిషనర్ చాంబర్ లో డయల్ యువర్ కమిషనర్, కౌన్సిల్ హాల్లో పిజిఆర్ఎస్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత డయల్ యువర్ కమిషనర్ ద్వారా ప్రజల నుండి …
Read More »
Prajavartha Online Telugu News