Breaking News

ఎమ్మెల్యే ఆర్కే కార్యాలయంలో ఏపిజే అబ్దుల్ కలామ్ వర్దంతి కార్యక్రమం…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కార్యాలయంలో మంగళవారం ఏపీజే అబ్దుల్ కలామ్ వర్దంతి కార్యక్రమం ఎమ్మెల్యే ఆర్కే పాల్గొని పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ అబ్దుల్ కలామ్  ఆశయాలకు అనుగుణంగా మనమందరం ఆయన బాటలో నడవాలని అన్నారు. జీవితంలో పైకి ఎదగాలంటే పేదరికం అడ్డుకాదాని నిరూపించారని, పేపర్ బాయ్ నుండి భారత రాష్ట్రపతి స్థాయికి చేరటం మనం మర్చిపోలేమన్నారు. ఆయన చేసిన పదవుల వలన ఆ పదవులకు వన్నె వచ్చిందని అన్నారు. ఆయన ఏ రంగంలో పనిచేసినా ఆ రంగానికి ఎనలేని సేవలందించారు అని అన్నారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్  భౌతికంగా మన మధ్యన లేకపోయినా మన అందరి గుండెల్లో నిలిచిపోతారని అన్నారు. ఈ కార్యక్రమంలో వై ఎస్ ఆర్ సి పి నాయకులు, కార్యకర్తలు, స్థానికులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

యువతకు వినూత్న మరియు భవిష్యత్తు నైపుణ్యాలపై సీడ్ యాప్ సంస్థ లో వర్క్‌షాప్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పరిశ్రమతో రాష్ట్ర యువతను మమేకం చేసే లక్ష్యంతో వారికి శిక్షణ అందించి మెరుగైన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *