Breaking News

త్వరలోనే 177 గ్రామాలకు సంబంధించి డ్రోన్ ఇమేజెస్ అందుబాటులోనికి రానున్నాయి… 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి రెవెన్యూ డివిజన్ లోని 50 గ్రామాల్లో డ్రోన్ ఫ్లయ్యింగ్ నిమిత్తం గ్రామసరిహద్దుల నిర్ధారణ, గ్రామకంఠం సరిహద్దుల నిర్ధారణ ఆగష్టు 5 నుంచి ప్రారంభించి 15 రోజుల్లో పూర్తి చేయాలని భూపరిపాలనా ముఖ్య కమిషనరు సంబంధి తాధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, తదితర అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో యంఐజి లేఅవుట్లు, లేఅవుట్లు, రీసర్వే విషయాలపై సిసియల్ పై సమీక్షించారు. ఈ వీడియోకాన్ఫరెన్స్ లో స్థానిక కలెక్టరు క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టరు జె. నివాస్ పాల్గొనగా, విజయవాడ సబ్ కలెక్టరు కార్యాలయం నుంచి జాయింట్ కలెక్టరు డా. కె.మాధవిలత, విజయవాడ సబ్ కలెక్టరు జియస్ యస్. ప్రవీణ్ చంద్, జిల్లా రెవెన్యూ అధికారి యం. వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా సిసియల్ప మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటివరకూ 745 గ్రామాల్లో డ్రోన్ ఫ్లై నిర్వహించడం జరిగిందన్నారు. త్వరలోనే 177 గ్రామాలకు సంబంధించి డ్రోన్ ఇమేజెస్ (ఓఆర్ఐ మ్యాప్స్) అందుబాటులోనికి రానున్నాయన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పెనుగంచిప్రోలులో మజ్జిగ పంపిణీ కార్యక్రమం

పెనుగంచిప్రోలు, నేటి పత్రిక ప్రజావార్త : పెనుగంచిప్రోలు మండలంలో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్, పెనుగంచిప్రోలు బ్రాంచ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *