-కమిషనర్ రాహుల్ మీనా
-పుష్కర ఘాట్ లో ఏర్పాట్ల పరిశీలన
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
కార్తీక మాసం నేపథ్యంలో గోదావరి స్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు కమిషనర్ రాహుల్ మీనా తెలిపారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం పుష్కర ఘాట్ లో ఏర్పాట్లను పరిశీలించారు. భక్తుల రద్దీకి తగినట్లు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. లైటింగ్, సీసీ కెమెరాలు, త్రాగునీరు, స్నానపు గదులు, దుస్తులు మార్చుకొను గదులు, లాకర్లను పరిశీలించారు. పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టంతో పాటు స్విమ్మర్లను, పడవలను సరిపడా అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. ఘాట్ వెంబడి నది ఒడ్డున ఇసుక వేయించాలని.. అలాగే పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. కార్తీక మాస దీపోత్సవ వేడుకలలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఆయన వెంట ఎంహెచ్ఓ వినూత్న, ఎస్ఈ(ఇంఛార్జి) రీటా, ఈఈ మాధవి, డీఈ సత్యనారాయణ, ఏఈలు వెంకటేష్, ఆంజనేయులు ఉన్నారు.
Prajavartha Online Telugu News