విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ నందు APCOS అవుట్ సోర్సింగ్ పద్దతిన పోస్ట్ లు భర్తీ చేయుటకు జరుగుతున్న ఇంటర్వ్యూ లకు రెండోవ రోజు 437 మందిని ప్యానల్ కమిటి అధికారులు ఇంటర్వ్యూలు నిర్వహించి సర్టిఫికెట్స్ వెరిఫీకేషన్ చేసారు. నేడు ప్యానల్ కమిటి అధికారులు చీఫ్ ఇంజనీర్ యం. ప్రభాకర్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.జి.గీతభాయి, అధనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) యు.శారదాదేవి వార్ల ఆద్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. గాంధీజీ మున్సిపల్ హై స్కూల్ నందు 198 మందికి గాను 168 మంది, ఐ.వి.ప్యాలస్ నందు 192 మందికి గాను 158 మంది, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నందు 220 మందికి గాను 188 మంది హాజరు అయినారు. మొత్తం 610 మందికి గాను 514 హాజరు అయినారు.
Prajavartha Online Telugu News