Breaking News

శ్రీశ్రీశ్రీ దుర్గా మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కండ్రికలోని శ్రీశ్రీశ్రీ దుర్గా మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో ఆదివారం నిర్వహించిన ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొబ్బరికాయ కొట్టి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి, నవధాన్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ:- ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా మాత్రమే కాకుండా సమాజంలో సానుకూల శక్తిని పెంపొందించే కేంద్రాలుగా నిలుస్తాయని అన్నారు. ఇలాంటి పవిత్ర కార్యక్రమాలు ప్రజల్లో భక్తి భావాన్ని పెంపొందించడమే కాకుండా సామాజిక ఐక్యతకు కూడా దోహదపడతాయని పేర్కొన్నారు. దేవాలయ అభివృద్ధికి ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని, భక్తులకు అవసరమైన సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు, భవిష్యత్తులో కూడా ఆలయ అభివృద్ధి కోసం అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో:- ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు మరియు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పెనుగంచిప్రోలులో మజ్జిగ పంపిణీ కార్యక్రమం

పెనుగంచిప్రోలు, నేటి పత్రిక ప్రజావార్త : పెనుగంచిప్రోలు మండలంలో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్, పెనుగంచిప్రోలు బ్రాంచ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *