విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరం ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనంలో వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ విజయవాడ నగర శాఖ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ శాసనసభ్యులు మల్లాది విష్ణు చేతులమీదుగా జరిగింది. అనంతరం కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ నగర శాఖ అధ్యక్షులు షేక్ ఇంతియాజ్, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి.సుధాకర్, బి.శివప్రసాద్ నాయక్, కోశాధికారి మహమ్మద్ రఫీ, వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ కరీముల్లా, కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్, మహమ్మద్ హుస్సేన్, ఉదయ కిరణ్, ధనరాజ్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News