Breaking News

బాబు జ‌గ్జీవ‌న్ రాం ఆశయాలు కోసం కృషి చేద్దాం… : దేవినేని అవినాష్

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
మంగళవారం భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రాం 114వ జయంతి సంధర్భంగా తూర్పు నియోజకవర్గం లో 7వ డివిజన్ శిఖామణి సెంటర్ నందు బాబు జగ్జీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి వైస్సార్సీపీ ఇంచార్జి దేవినేని అవినాష్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ అవమానాల అనుభవాలతో ఉన్నత శిఖరాలను అధిరోహించిన మహోన్నత వ్యక్తి జగగ్జీవన్ రాం అని, సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి వారి సంక్షేమానికి కృషి చేసిన కృషి వలుడు అని, సమాజంలో ఆసమానతులను రూపుమాపేందుకు అలుపెరుగని పోరాటం చేసిన సంఘ సంస్కర్త అని, స్వాతంత్ర్య సమరయోధుడుగా దేశం కోసం ఆహర్నిశలు పనిచేసి, స్వాతంత్ర్య భారతవనిలో ఉప ప్రధానిగా తన సేవలను అందించిన గొప్ప వ్యక్తి జగ్జీవన్ రావు అని అటువంటి ఆయన ఆశయ సాధనకు మనందరం కలిసి ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మాధురి, అంబేద్కర్, వైస్సార్సీపీ నాయకులు రాజ్ కమల్, చిత్రం లోకేష్, విఠల్ సంపత్, సుభాషిణి, ప్రేమలత మరియు వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో 50వ రోజు కొనసాగుతున్న యూత్ టైం బ్యాంక్ సేవలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశా ఐఏఎస్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన యూత్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *