Breaking News

గుంటూరు కు ప్రతి4 నిమిషాలకో బస్సు

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా తెనాలినుండి గుంటూరు కు ప్రతి4నిముషాలకో బస్సు ఫ్లీక్వెన్సి(Frequency) పెంచామని తెనాలి DM రాజశేఖర్ అన్నారు. అంతకు మునుపు ప్రతి 5 నిమిషాలకు బస్సుండేదన్నారు. కొత్తగా జిల్లాకేంద్రాలైన”బాపట్ల” “మచీలీపట్నం” నేరుగా వెళ్ళటానికి బస్సు ప్రతిపాదనలు డివిజన్ అథికారులకు పంపామని, తెనాలి నుండి దంతలూరు మీదుగా కొల్లిపర, చినపాలెం దుగ్గిరాల బస్సు వేసినట్లు అలాగే ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం కు ఉదయం ఫ్రీక్వెన్సీ ఉదయం 5-15, -45 ,7-45,పెంచినట్లు తెలిపారు. బస్సు డిపో వెనుక వైపు 60 అడుగుల సెంట్రల్ లైటింగు రోడ్డు ను ,స్కూలు బస్సులు మరమ్మతుల వాహనాలతో ఉన్న వషయం ప్రస్తావించగా వాటిని తొలగింఛవలసిన బాథ్యత మునసిపల్ాఅథికారులపై ఉందన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : కర్ణాటక నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి విస్తరించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *