Breaking News

ఏపీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు రాష్ట్రస్థాయి కౌన్సిలింగ్

-ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాల్లో 152 మంది విద్యార్థులకు సీట్లు కేటాయింపు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు రాష్ట్రస్థాయి కౌన్సిలింగ్ గురువారం గుంటూరులోని పరీక్షా భవన్‌లో నిర్వహించామని APREI సొసైటీ కార్యదర్శి ఆర్.నరసింహారావు తెలిపారు. ఆంధ్రా విశ్వవిద్యాలయం, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం పరిధికి చెందిన విద్యార్థులు 152 మందిని ఎంపిక చేశారు. బి.ఏ (హెచ్ఈపీ) 40 మంది, బికాం (జనరల్) 40 మంది, బీఎస్సీ (ఎంపీసీ) 36 మంది, బీఎస్సీ (ఎంఎస్సీఎస్) 36 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ & కన్వీనర్(APRJC – CET) హెచ్.ఎండీ.ఉబెదుల్లా, APRDC ప్రిన్సిపాల్ YNS చౌదరి, లైజన్ ఆఫీసర్ డా. పి.వి.మల్లేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Check Also

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలుస్తాను : దేవినేని అవినాష్

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *