Breaking News

బాలికల సంక్షేమ వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీ

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
వసతి గృహంలో విద్యార్థులకు ఎటువంటి లోటు లేకుండా మెనూ ప్రకారం తప్పనిసరిగా భోజన సదుపాయం కల్పించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ వసతి గృహ సంక్షేమ అధికారిని ఆదేశించారు. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ గన్నవరం మండలంలోని దేవాజి గూడెం లో ఉన్న వెనుకబడిన తరగతుల బాలికల సంక్షేమ వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహిస్తున్న పామోలిన్ నూనె, చిక్కి తదితర పలు రకాల రిజిస్టర్ లను, హాజరు పట్టిని కలెక్టర్ పరిశీలించారు. నిర్ణీత మెనూ ప్రకారం ఉదయం మధ్యాహ్నం రాత్రి వేళల్లో భోజనం సరిగా పెడుతున్నారా లేదా అని కలెక్టర్ విద్యార్థులను విచారించారు. అందుకు వారు సరిగా పెడుతున్నారని కలెక్టర్కు తెలిపారు. ఈ తనిఖీలో వసతి గృహ సంక్షేమ అధికారి జేవియన్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *