తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రస్తుతం నెల్లూరు డివిజన్లో నెం2 గా ఉన్న APSRTC తెనాలి డిపోను నెం. 1.గా ఉంచాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. సోమవారం నూతనంగా 6 కొత్త బస్సులను ప్రారంభిస్తూ ప్రయాణీలకు మెరుగైన సౌకర్యాలను అందించి రాబడి మార్గాలను పెంచాలన్నారు. బెంగుళూరుకు , మరో బస్సు కేటాయించాలని , డిపోలోని సమస్యలు శాస్వతంగా పరిష్కరించాలని అందులకు తాను సదా సహాయకారాలను అందిస్తాని 30 లక్షలను తక్షణమే మంజూరు చెశారు. ఈ ప్రారంభకార్యక్రమానికీ హెచ్చుసంఖ్యలో హాజరైన ప్రజలనుద్దేశించి అథికారులను గౌరవించి పరస్పరం పనులు చేసుకోవాలని అపుడె తమ అథినేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆశయమైన రాష్ట్రం అభివృథ్థి చెందుతుందని హర్షథ్వానాలమథ్య అన్నారు.
ఈ కార్యక్రమానికి తెనాలి DSP రమేష్ CIలు పటిష్ట ఏర్పాట్లు చేశారు. మునిసిపల్ కమిషనర్ బండి శేషన్న, DPTO M.రవికాంత్, DM రాజశేఖర్, నిర్వహణ సహాయ మేనేజర్ అభిరాంనాయక్, కేశన శంకర్రావు, జొన్నాదుల వేంకటేశ్వరావు, ఈదర వేంకట పూర్ణచంద్రరావు, TDP P రమ్య, హరిదాసు, గౌరీశంకర్, వీరమహిళ రజని ప్రభృతులు పాల్గొన్నారు,
Prajavartha Online Telugu News