Breaking News

థర్డుపార్టీ ఏజన్సీల వల్లే కంపెనీల్లో భద్రతా ప్రమాణాలు సన్నగిల్లాయి

-అనకాపల్లి సెజ్ లో జరిగిన అగ్నిప్రమాద బాదితులకు తక్షణ సహాయ చర్యలు అందజేస్తున్నాం
-రాష్ట్ర కార్మిక, ప్యాక్టరీలు, బాయిలర్స్ & భీమా వైద్య సేవల శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన థర్డు పార్టీ ఏజన్సీ విధానం కారణంగానే కంపెనీల్లో భద్రణా ప్రమాణాలు సన్నగిల్లి ప్రమాదాలకు దారితీస్తున్నాయని రాష్ట్ర కార్మిక, ప్యాక్టరీలు, బాయిలర్స్ & భీమా వైద్య సేవల శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. బుధవారం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లో రియాక్టరు ప్రేలడం వల్ల జరిగిన అగ్నిప్రమాదం నేపథ్యంలో రాష్ట్ర సచివాలయం పబ్లిసిటీ సెల్లో ఆయన పాత్రికేయులతో మట్లాడుతూ బాదితులకు తక్షణ సహాయక చర్యలు అందజేస్తున్నట్లు తెలిపారు. అచ్యుతాపురం సెజ్ లో ఎసెన్సియా అడ్వాన్సుడ్ సైన్సెస్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ రియాక్టర్ ప్రేలిన ప్రమాదంలో గాయపడిన వారిని తక్షణ సహాయక చర్యల్లో భాగంగా దగ్గర్లోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుత్రుల్లో చికిత్స అందజేయడం జరుగుతున్నదన్నారు. జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ సంఘన స్థలానికి హుటాహటిన చేరుకుని సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారన్నారు.

గత ప్రభుత్వ హయాంలో ధర్డు పార్టీ ఏజన్సీ విదానాన్ని ప్రవేశపెట్టడం వల్ల కంపెనీల్లో భద్రతా ప్రమాణాలు పూర్తిగా సన్నగిల్లాయన్నారు. కార్మిక శాఖ పూర్త స్థాయిలో నిర్లక్ష్యానికి గురైందన్నారు. విశాఖపట్నంలో దళారీ వ్యవస్థ ఎక్కువగా ఉందన్నారు. ఇ.ఎస్.ఐ. ఆసుపత్రుల నిర్వహణ కూడా పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేయడం జరిగిందని, కేంద్ర నిధులను కూడా సక్రమంగా వినియోగించుకో లేకపోవడం జరిగిందన్నారు. భవన నిర్మాణ కార్మికులకు అందాల్సిన రాయితీలను, సంక్షేమ పథకాలను నిలుపుదల చేయడం జరిగిందన్నారు. ఈ సమస్యలను అన్నింటినీ సరిదిద్దేందుకు అధికారులతో పలు మార్లు సమీక్షలు నిర్వహిస్తూ కార్మిక శాఖలో పూర్వవైభవాన్ని తీసుకు వచ్చేందకు చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *