Breaking News

నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష లు దరఖాస్తు నమోదుకు చివరి తేదీ సెప్టెంబర్ 24

-డి ఎస్ ఈ వో కే. వాసుదేవ రావు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో డిసెంబర్ 8 న జరుగనున్న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష (NMMS) కొరకు దరఖాస్తు చేసుకొనుటకు ఆన్లైన్ అప్లికేషన్ ను ప్రభుత్వ పరీక్షల కార్యాలయ వెబ్సైట్ www.bse.ap.gov.in నందు 05-08- 2024 నుండి అందుబాటులో ఉంచడమైనదని, ఈ పరీక్షకు నమోదు చేసుకొనుటకు చివరి తేదీని 24-09-2024 వరకు పొడిగించడమైనదని జిల్లా పాఠశాల విద్యాధికారి కె .వాసుదేవరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రింటెడ్ నామినల్ రోల్ మరియు ఒరిజినల్ ఎస్ బి ఐ కలెక్ట్ రశీదును సంబంధిత జిల్లా విద్యా శాఖాధికారి వారి కార్యాలయంలో సమర్పించుటకు చివరి తేది 27-09-2024 అని తెలియ చేశారు. జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మునిసిపల్, ఎయిడెడ్, మండల పరిషత్ ప్రాధమికోన్నత పాఠశాలలు మరియు వసతి సౌకర్యం లేని ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలలలో 8వ తరగతి చదువుచూ, కుటుంబ సంవత్సరాదాయం రూ.3,50,000/- లోపు ఉన్న విద్యార్థులు అందరూ ఈ పరీక్ష వ్రాయుటకు అర్హులని, నమోదు చేసే సమయంలో విద్యార్థి ఆధార్ కార్డ్ లో ఉన్న విధంగానే విద్యార్థి పేరు, పుట్టిన తేదీ మరియు తండ్రి పేరు నమోదు చేయవలెను. దరఖాస్తు చేసుకొనుటకు ఎటువంటి ధృవపత్రాలు అవసరం లేదు గాని పరీక్ష వ్రాసే సమయమునకు అన్ని ధృవపత్రాలు సిద్ధం చేసుకొనవలెను. పరీక్ష రుసుము ఓ.సీ, బి.సి విద్యార్ధులకు రూ.100/- మరియు యస్.సి. యస్.టి విద్యార్ధులకు రూ.50/-. పూర్తి వివరముల కొరకు ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయపు వెబ్ సైటు www.bse.ap.gov.in నందు గానీ లేదా జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయంలో గాని తెలుసుకొనవలసినదిగా కె. వాసుదేవ రావు తెలియజేసియున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని అన్ని ప్రధాన డ్రైన్లలోని పూడిక తీత పనులు వేగవంతం చేసి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *