విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులుగా నియమితులైన సందర్భంగా పోతిన వెంకట మహేష్ కి శుభాకాంక్షలు తెలియజేస్తూ గజమాలతో ఏలూరి సాయి శరత్ సత్కరించారు. ఈ సందర్భంగా ఏలూరి సాయి శరత్ మాట్లాడుతూ పోతిన వెంకట మహేష్ నిత్యం అవినీతి పైన పోరాడుతూ ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతూ ముందుకు సాగుతున్న తీరు , ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతున్న వ్యక్తిగా పోతిన వెంకట మహేష్ రాబోయే ఎన్నికలలో ఎమ్మెల్యేగా పశ్చిమ నియోజకవర్గం నుండి వారి గెలుపు కోసం యువత మొత్తం కలిసికట్టుగా పని చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది పిళ్ళ శ్రీను, శనివారపు శివ, కాపు వడ్డీ, సయ్యద్ మొహిద్దిన్, భావి శెట్టి శ్రీను, షఫీ, షేక్ అబ్దుల్, లంకలపల్లి అశోక,చేన్నం శెట్టి వికాస్, అడప హరీష్ తదితరులు పాల్గొన్నారు
Tags vijayawada
Check Also
సమాజ సేవలో స్వచ్ఛంధ సంస్థలు భాగస్వామ్యం కావాలి
-కలక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం కలెక్టరేట్ లో “మదర్ థెరీసా చారిటబుల్ సొసైటి”, …