Breaking News

నూతన స్వయం సహాయక గ్రూప్ లను ఏర్పాటుకు మెప్మా సిఎంఎం, సిఓలు చర్యలు తీసుకోవాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో వార్డ్ సచివాలయాల వారీగా నూతన స్వయం సహాయక గ్రూప్ లను ఏర్పాటుకు మెప్మా సిఎంఎం, సిఓలు చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. శనివారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో మెప్మా(ఉపా సెల్), పరిపాలన, లీగల్ సెల్ విభాగాల సమీక్షా సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో వార్డ్ సచివాలయాల వారీగా నూతనంగా స్వయం సహాయక గ్రూప్ లు ఏర్పాటు చేయడానికి మెప్మా సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతి శనివారం జరిగే సమీక్షా సమావేశంలో నూతన గ్రూప్ ల ఏర్పాటుపై ప్రత్యేక సమీక్షా చేస్తామని తెలిపారు. అలాగే నగరంలోని హిజ్రాలతో ప్రత్యేకంగా స్వయం సహాయక గ్రూప్ లను ఏర్పాటు చేయాలన్నారు. పిఎం స్వానిధిలో పెండింగ్ రుణాలు నవంబర్ 15లోపు లబ్దిదారులకు అందేలా బ్యాంకర్లతో సమన్వయం చేసుకోవాలన్నారు. పిఎం విశ్వకర్మకు అందిన దరఖాస్తులను వార్డ్ వెల్ఫేర్ కార్యదర్శులు క్షేత్ర స్థాయి పరిశీలన చేసి జిల్లా పరిశ్రమల శాఖకు అందించాలన్నారు. నైబర్ హుడ్ బిజినెస్ యూనిట్ (ఎన్.బి.యు.) సర్వే త్వరగా పూర్తి చేయాలని, హౌసింగ్ కి సంబందించి స్వయం సహాయక సభ్యులకు రూ.35 వేల రుణాన్ని త్వరగా మంజూరు చేయించాలన్నారు. ప్రతి నెల తూర్పు నియోజకవర్గంలో శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం, పశ్చిమ నియోజకవర్గంలో ఎన్టీర్ మున్సిపల్ స్టేడియంలో మెప్మా బజార్లు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం కోర్ట్ కేసులను విభాగాల వారీగా సమీక్షించి, కేసులు కన్టేమ్ట్ ల వరకు వెళ్లకుండా సకాలంలో కౌంటర్లు దాఖలు చేయాలన్నారు. కోర్ట్ తీర్పులను సత్వరం అమలు చేయాలని ఆదేశించారు.
సమావేశంలో అదనపు కమిషనర్ సిహెచ్.ఓబులేసు, డిప్యూటీ కమిషనర్లు డి.శ్రీనివాసరావు, సిహెచ్.శ్రీనివాస్, మెప్మా పిఓ రామారావు, సూపరిండెంట్లు పద్మనాభరావు, బాలాజీ బాష, మదన్ గోపాల్, మెప్మా సిఓలు, సిఎంఎంలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం

-రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ కేంద్రంగా దక్షిణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *