విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ ఛైర్మన్ గా నియమితులైన డూండీ రాకేష్ కు విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ శుభాకాంక్షలు తెలిపారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో ఎంపి కేశినేని శివనాథ్ ను డూండీ రాకేష్ మర్యాద పూర్వకంగా ఆదివారం కలిశారు. ఈ సందర్భంగా డూండీకి అభిందనలు తెలపటంతో పాటు పార్టీతో పాటు ప్రజలకి మరింత సేవ చేసి రాజకీయంగా మరింత ఉన్నత పదవులు అందుకోవాలని ఆకాంక్షించారు. పార్టీ కష్ట కాలంలోనూ పార్టీని అంటి పెట్టుకుని చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసేందుకు డూండీ రాకేష్ తన వంతు కృషి చేశాడని కొనియాడారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసిపి నాయకులు వ్యాపారస్తులను ఇబ్బందులకు గురి చేస్తుంటే ఆ సమస్యలపై పోరాటం చేస్తూ.. వ్యాపారవర్గాలను ఏకం చేయటంలో కీలకపాత్ర పోషించాడన్నారు. తనకి అభినందనలు తెలిపిన ఎంపి కేశినేని శివనాథ్ కు డూండీ రాకేష్ కృతజ్ఞతలు తెలిపారు.
Prajavartha Online Telugu News