-సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో ఈ నెల 14న అన్ని పాఠశాలల్లో నిర్వహించాల్సిన మెగా పేరెంట్స్ – టీచర్స్ మీటింగ్ (మెగా పీటీఎం) తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS., ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమాన్ని డిసెంబరు మొదటి వారంలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని, త్వరలో తేదీ, ఇతర వివరాలను ప్రకటిస్తామని వెల్లడించారు.
Prajavartha Online Telugu News