Breaking News

Tag Archives: machilipatnam

యోగా తో అద్భుత ప్రయోజనాలు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : యోగాతో అద్భుతమైన ప్రయోజనాలున్నాయని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. ఇటీవల రాష్ట్ర స్థాయి లో ఫైళ్ళ పరిష్కారం లో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుండి ప్రశంసలు పొందిన కృష్ణా జిల్లా కలెక్టర్ డికె బాలాజీ గారిని యోగా గురువులు మరియు సభ్యులు ఘనంగా సన్మానించారు . సోమవారం ఉదయం గాంధీనగర్ లోని వాకర్స్ అసోసియేషన్ హాలు లో యోగా తరగతులు అనంతరం కలెక్టర్ గారిని శాలువాలు, పూల దండలు, పుష్ప గుచ్చాలు, …

Read More »

రైతు ఆదాయం పెంచినపుడే అసలైన అభివృద్ధి

-మచిలీపట్నంలో మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో గోదాము నిర్మాణానికి భూమిపూజ చేసిన మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రైతుకు మెరుగైన ఆదాయం కల్పించినపుడే అసలైన అభివృద్ధి సాకారమైనట్లు అని రాష్ట్ర గనులు, భూర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నం రైల్వే స్టేషన్ సమీపంలో ఏపీ మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన రెండు గోదాముల నిర్మాణానికి భూమిపూజ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మార్కెటింగ్ వ్యవస్థను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం …

Read More »

రైతులందరూ ప్రకృతి వ్యవసాయం వైపు దృష్టిసారించాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రైతులందరూ ప్రకృతి వ్యవసాయం వైపు దృష్టిసారించాలని, పాడి ఆవులతో పాలు అమ్మకాలు జరపడంతో పాటు గోమయం, గోమూత్రంతో కూడా వివిధ రకాల పూజా సామాగ్రిని తయారుచేసి అధిక ఆదాయం పొందాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఎస్ హెచ్ జి మహిళలకు పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కలెక్టర్ కుటుంబ సమేతంగా గూడూరు మండలంలోని పినగూడూరు లంకలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న అభ్యుదయ రైతు మేకపోతుల విజయ రామ్ గురూజీ నేతృత్వంలోనీ ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి అక్కడ …

Read More »

ఈనెల 24న ఉయ్యూరు బస్టాండ్ సమీపంలోని “NAC ట్రైనింగ్ సెంటర్” నందు జాబ్ మేళా..

-నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి… -జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ,ఐఏఎస్  మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.24.12.2025 బుధవారం ఉదయం 09:00 గంటలకు ఉయ్యూరు బస్టాండ్ సమీపంలోని శ్రీలంక కాలనీ నందు గల “NAC ట్రైనింగ్ సెంటర్(Old BC Girls Hostel)” నందు “జాబ్ మేళా” నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ,ఐఏఎస్ తెలియజేసారు. ఈ జాబ్ మేళాలో యాక్సిస్ బ్యాంక్, మెడ్ప్లస్ హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ …

Read More »

పల్స్ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ భవిష్యత్తులో ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా నివారించేందుకు రెండు పల్స్ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ నగరంలోని చిలకలపూడి శ్రీ పాండురంగ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో 5 సంవత్సరాలలోపు పిల్లలకు వారి పేర్లను ఎంతో ఆప్యాయంగా అడుగుతూ పోలియో చుక్కలు వేశారు. జిల్లా కలెక్టర్ తన సతీమణి పృద్వి, కుమారుడు …

Read More »

బలమైన కుటుంబ వ్యవస్థ ద్వారానే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యం

-జిల్లా ప్రధాన న్యాయమూర్తి గుట్టాల గోపి పెడన, నేటి పత్రిక ప్రజావార్త : ఆరోగ్యకరమైన కుటుంబ సంబంధాలు సామాజిక స్థిరత్వానికి మూలం, నేరాలు, సామాజిక వ్యతిరేక ప్రవర్తనలను తగ్గిస్తాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గుట్టాల గోపి పేర్కొన్నారు. శనివారం ఉదయం పెడన మండలంలోని పెడన ఫంక్షన్ హాల్లో జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు కృష్ణా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, జిల్లా పరిపాలనా యంత్రాంగం సంయుక్తంగా నూతన తరహా న్యాయ సేవల శిబిరం …

Read More »

ప్లాస్టిక్ వాడకం తగ్గించుకుని పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతను సామాజిక బాధ్యతగా పాటించి, ప్లాస్టిక్ వాడకం తగ్గించుకుని పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ కలెక్టరేట్లో జరిగిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. కలెక్టరేట్లో వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు కార్యాలయపు సిబ్బందితో కలిసి జిల్లా కలెక్టర్ పిచ్చి మొక్కలు, చెత్తాచెదారాలు, ఎండిపోయిన ఆకులను, విరిగిపోయి పడిపోయిన చెట్టు కొమ్మలను తొలగించి మునిసిపల్ ట్రాక్టర్లకు ఎక్కించారు. ప్రతి శనివారం మాదిరిగానే …

Read More »

సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లతో జిల్లా అభివృద్ధి

-జిల్లా సమీక్షా మండలి సమావేశంలో జిల్లా ఇన్చార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లతో జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్ళేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని రాష్ట్ర కార్మిక, కర్మాగారాలు, బాయిలర్లు, వైద్య బీమా సేవల శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం స్థానిక జిల్లా పరిషత్ సమావేశపు మందిరంలో జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా …

Read More »

ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచానికి శాంతియుత మార్గాన్ని చూపి ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని తన రక్తాన్ని చిందించిన త్యాగమూర్తి, కరుణామయుడు ఏసుప్రభువు అని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కీర్తించారు. శుక్రవారం రాత్రి నగరంలోని రైల్వే స్టేషన్ వద్ద గల శుభం కన్వెన్షన్ హాలులో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు రాష్ట్ర మంత్రి ముఖ్యఅతిథిగా విచ్చేసి అందరికీ ముందస్తుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి …

Read More »

15 మందికి కారుణ్య నియామకాలు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : విధులను అంకితభావంతో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి కొత్తగా నియమితులైన ఉద్యోగులకు సూచించారు. శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో 15 మందికి కారుణ్య నియామకాల కింద నియామక పత్రాలు అందజేశారు. నియామక పత్రాలు అందుకున్న వారిలో 9 మంది జూనియర్ అసిస్టెంట్ పదవులకు, 6 మంది ఆఫీస్ సబార్డినేట్ పదవులకు వివిధ ప్రభుత్వ శాఖలకు కేటాయిస్తూ జిల్లా కలెక్టరు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వారికి …

Read More »