విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైద్యో నారాయనో హరి అన్నారు పెద్దలు… ప్రతీ ఒక్కరికి కూడా అనారోగ్యంతో బాధ పడిన సందర్భంలో దేవుడిలా నేనున్నాను అంటూ వైద్యం చేసి, ఆరోగ్యాన్ని అందించటంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న మన వైద్యులు అందరికి పేరు పేరున డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియచేస్తూ… ఈ రోజు డాక్టర్స్ డే సందర్బంగా ఎన్టీఆర్ జిల్లా అర్బన్ ప్రైమరీ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు రాజారత్నరాజు మరియు ఎన్టీఆర్ జిల్లా ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ అధ్యక్షులు సయ్యద్ ఖాదర్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో డి ఎమ్ &హెచ్ ఓ డాక్టర్ ఇందుమతిని, డి ఐ ఓ డాక్టర్ శరత్ ని, ఆర్ బి ఎస్ కే ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ మాధవి ని, డి పి ఎమ్ ఓ డాక్టర్ నవీన్ ని ఇతర ప్రోగ్రాం ఆఫీసర్స్ డాక్టర్ సునీల్ ని, డాక్టర్ కార్తీక్ ని, డాక్టర్ విద్యాసాగర్ ని, డాక్టర్ శ్రావణి ని, డాక్టర్ నవీన ని సత్కరించటం జరిగింది.
Prajavartha Online Telugu News